NTV WebDesk
Author- NTV Telugu-
ఆగస్టు 23, సోమవారం దినఫలాలు…
మేషం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. […] -
పాక్ కీలక నిర్ణయం: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి…
వచ్చేనెల 22 నుంచి పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకునే యాత్రికులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గురునానక్ దేవ్ వర్థంతి సందర్బంగా ప్రతి ఏడాది వేలాదిమంది సిక్కులు భారత్ నుంచి పాక్ వెళ్లి అక్కడ గురునానక్ మహాసమాధిని సందర్శిస్తుంటారు. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా యాత్ర సాఫీగా సాగడంలేదు. ఇప్పుడు పాక్ ప్రభుత్వం కర్తార్పూర్ యాత్రకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిక అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. గురుద్వారాకు అనుమతులు ఇచ్చే […] -
బీహార్లో విచిత్రం: చెట్టుకు రాఖీ కట్టిన సీఎం… ఎందుకంటే…
రక్షాబంధన్ రోజుల అన్నయ్యలకు అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. అన్ని విధాలుగా అన్న తోడుగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా రాఖీని కడతారు. అయితే, బీహార్ అక్కడి ప్రభుత్వం గత కొన్ని సంవత్సారాలుగా రాఖీ పండుగ రోజున సీఎంతో సహా అనేకమంది మంత్రులు అధికారులు చెట్లకు రాఖీలు కడుతున్నారు. రక్షాబంధన్ రోజును వృక్షరక్షాబంధన్ దివస్ పేరుతో చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం 2012 నుంచి ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా […] -
తాలిబన్లకు షాక్: తిరుగుబాటుదారుల దాడిలో 11 మంది మృతి…
బగ్లాన్ ప్రావిన్స్పై పట్టు సాధించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పొలిటికల్గా డీల్ కుదుర్చుకుందామని చెబుతూనే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నలుగురు చిన్నారులను, ముగ్గురు మహిళలను తాలిబన్లు కాల్చిచంపారు. దీనికి ప్రతీకారంగా తిరుగుబాటుదారులు తాలిబన్లపై విరుకుపడ్డారు. తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో11 మంది తాలిబన్లు మృతిచెందారు. తాలిబన్ కమాండర్తో సహా ఏడుగురు తాలిబన్లను తిరుగుబాటుదారులు బంధించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగైనా అరాచకపాలనను పారద్రోలి తిరిగి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేందుకు తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు. Read: తాలిబన్ల కోసం రంగంలోకి దిగిన రష్యా… వారితో […] -
తాలిబన్ల కోసం రంగంలోకి దిగిన రష్యా… వారితో చర్చలకు సిద్ధం…
తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా […] -
రేపటి నుంచి తెలంగాణలో ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్…
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ అరకోటి మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు. 10 రోజులపాటు అర్హులైన అందరికీ వ్యాక్సిన్లు అందింబోతున్నారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ […] -
కంటతడిపెట్టిన ఆఫ్ఘన్ ఎంపీ… 20 ఏళ్ల కష్టం…
ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎటునుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రాణాలు గుప్పిట పట్టుకొని దొరికిన విమానం పట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. సామాన్యులతో పాటుగా ఆఫ్ఘన్ నేతలు కూడా వివిధ దేశాలకు పారిపోతున్నారు. గత ప్రభుత్వంలోని నేతలను ఏమి చేయబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నా, వారి హామీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరనే సంగతి తెలిసిందే. ఇలా ఆఫ్ఘన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేందర్ సింగ్ […] -
తాలిబన్ ఎఫెక్ట్: బిర్యానీ ధరలు పెరగనున్నాయా?
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. తాలిబన్ల పాలనలో ప్రజలు ఎంతటి దుర్భర పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యయుగంనాటి చట్టాలను అమలు చేస్తారు. మహిళల పట్ల చులకనభావం పెరుగుతుంది. ఇది ఒవపైపైతే, మరోవైపు వాణిజ్యం. ఇప్పటి వరకు అంతా సవ్యంగా సాగిన వాణిజ్య వ్యాపారాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. వివిధ దేశాలతో వాణిజ్యాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలో వాణిజ్యసంబంధాలను నిలిపేయడంతో ఆ ప్రభావం ఇండియాలోని కొన్నింటిపై ప్రభావం చూపే […] -
ఎట్టకేలకు నెరవేరిన కాశ్మీరీ వాసుల కల… దాల్ సరస్సులో…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అందాల కాశ్మీర్కు సందర్శకుల రాక మొదలైంది. దాల్ సరస్సులో విహరించేందుకు జమ్ముకాశ్మీర్ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. అయితే, చాలాకాలంగా దాల్ సరస్సులో ఫ్లోటింగ్ ఏటీఎంను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఇప్పటికి నెరవేరింది. దాల్ సరస్సులో తెలియాడే ఏటీఎంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఏ ఫెర్రీపై ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లోటింగ్ ఏటీఎం […] -
ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆక్రమణలకు అవినీతే కారణమా…!!!
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ […]
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!