NTV WebDesk
Author- NTV Telugu-
బీహార్లో కొత్త రూల్: ఇకపై విద్యార్థినులు కాలేజీలకు ఇలా వస్తే… బయటకే…
బీహార్ రాజధాని పాట్నాలో సుందరవతి అనే కళాశాల ఉంది. పాట్నాలోని ఆ మహిళల కళాశాలకు మంచి పేరు ఉంది. ఈ కాలేజీలో 1500 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ కాలేజీ యాజమాన్యం కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. కాలేజీకి వచ్చే విద్యార్థినులు తప్పని సరిగా జడ వేసుకొని రావాలని, లూజ్ హెయిర్తో వస్తే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, సెల్ఫీలు దగడంపై నిషేదం విధించారు. దీంతో పాటుగా డ్రెస్కోడ్ను కూడా తీసుకురావడంతో స్టూడెంట్స్ ఆగ్రహం […] -
ఏపీ స్కూళ్లలో కరోనా టెన్షన్…
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యాయి. వారం రోజుల నుంచి చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. నాడునేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు అధునాతనమైన సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే, ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజూ వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. స్కూళ్లలోనూ కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న డీఆర్ఎం మున్సిపల్ స్కూళ్లో ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు […] -
ఆ రికార్డులను అందుకే తగలబెట్టేస్తున్నారట…
ప్రపంచం మొత్తం కరోనాతో టెన్షన్ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబన్లతో టెన్షన్ పడుతున్నది. తాలిబన్లు ఆక్రమణలతో ఆ దేశం ఇప్పుడు అయోయమ స్థితిలో పడిపోయింది. 1996 నుంచి 2001 వరకు ఆ దేశాన్ని తాలిబన్లు పరిపాలించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరుర్కొన్నారో అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 12 ఏళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంపై నిషేదం ఉన్నది. షరియా చట్టాల ప్రకారమే వారు పరిపాలిస్తుంటారు. ఇప్పుడు సుపరిపాలన అందిస్తామని, మహిళల హక్కులు గౌరవిస్తామని చెబుతున్నా వారి […] -
పంజ్షీర్ ప్రావిన్స్లో ఉద్రిక్తత: 300 మంది తాలిబన్లు హతం…
ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్ ప్రావిన్స్లో మళ్లీ ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. పంజ్షీర్ ప్రావిన్స్ ఇప్పటి వరకు తాలిబన్ల వశం కాలేదు. ఆ ప్రావిన్స్లోకి అడుగుపెట్టనివ్వబోమని అక్కడి సైన్యం చెబుతున్నది. అయితే, ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజ్షీర్లో తిరుగుబాటుదారుల కోసం తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో పంజ్షీర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడింది. పంజ్షీర్ సైన్యం దాడిలో 300 మంది తాలిబన్లు హతం అయినట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా […] -
అప్పటి వరకూ మాస్క్ పెట్టుకోక తప్పదా…!!
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తెరిపించినా దేశంలో ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో పాటుగా అన్ని రంగాలు తిరిగి ప్రారంభం కావడంతో మాస్క్ను పక్కన పెట్టి మామూలుగా తిరిగేస్తున్నారు. ఇలా చేయడం వలన కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, వేగంగా వ్యాక్సిన్ అమలు చేస్తున్నా తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలని, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడాల్సి వస్తుందని […] -
ఆ ఎద్దు కోసం కదలివచ్చిన గ్రామం… ఎందుకంటే…
మనుషులకు మనుషులు సహాయం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి స్వార్ధం వారిది. ఒక మనిషి బతికున్న సమయంలోనే ఆదుకోనివారు మరణించిన తరువాత వస్తారా చెప్పండి. మనుషులకే దిక్కులేప్పుడు ఇక పశువులు మరణిస్తే వస్తారా… ఎవరి బిజీ వారిది. అయితే, ఉత్తర ప్రదేశ్లోని ఓ గ్రామంలో ఓ ఎద్దు మరణిస్తే ఆ గ్రామం మొత్తం కదిలి వచ్చింది. ఒక మహా మనిషి మరణిస్తే ఎలాగైతే పుణ్యకార్యాలు నిర్వహిస్తారో ఆవిధంగానే ఆ ఎద్దుకు చేయాల్సిన పుణ్యకార్యాలు అన్ని నిర్వహించారు. […] -
ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్… గంటకు…
యూపీలోని అయోధ్యలో రామాలయం నిర్మాణం వేగంగా జరుగుతున్నది. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయోధ్యలో ఉన్న మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర ఎయిర్పోర్టుకు సమీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను నిర్మించబోతున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్కు అప్పగించారు. ఈ సంస్థ అధికారులు ఇటీవలే ఆయోధ్యవెళ్లి అక్కడ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వంతో చర్చలు […] -
వైరల్: ఒక జింక కోసం ఆరు సింహాల ఫైట్… చివరకు…
సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టార్గెట్ చేసింది అంటే వేట చిక్కాల్సిందే. ఓ జింకను వేటాడిన సింహం దానిని పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుంది. అయితే, ఈ జింక కోసం మరో ఐదు సింహాలు కూడా చెట్టు ఎక్కాయి. ఒకటి జింక మెడ భాగం గట్టిగా పట్టుకుంటే, మరోకటి దాని కాళ్లు పట్టుకుంది. అంతలో మరో సింహం చెట్టు ఎక్కి దాని పొట్టభాగం పట్టుకుంది. అయితే, అన్ని సింహాలు జింక కోసం పోటీ పడటంతో […] -
జిమ్లో సీఎం… ఫిట్నెస్ ఛాలెంజ్కు సిద్ధం…
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టాలిన్ పేరు మారుమ్రోగిపోతున్నది. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్గా పనిచేసిన రోజుల్లో చాలా ఉత్సాహంగా, ఫిట్గా కనిపించేవారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలపై చర్చించేవారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన దినచర్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిత్యం యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం తప్పనిసరి. 68 ఏళ్ల వయసులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన […] -
అమెరికా నిర్ణయంతో లాభాలు ఆర్జిస్తున్న తాలిబన్లు…
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు […]
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!