Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mohan Naidu: తెలంగాణలో మరో రెండు ఎయిర్పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి వరంగల్ వాసులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరంగల్ (మామునూరు) ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎయిర్పోర్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రే కీలకమని, భూసేకరణ పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ విషయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ ఒక చరిత్రలా జరిగిందని, ఇంత త్వరగా ఒక్క ఎకరా తక్కువ లేకుండా భూమిని సేకరించి తమకు అప్పగిస్తారని అనుకోలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణలో ఎయిర్పోర్టుల అభివృద్ధి, ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై ఇరునేతలు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చల వివరాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుబట్టి ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వరంగల్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం ఎంతో ఇష్టమైన ప్రాంతమని, అక్కడి చరిత్ర, సంస్కృతి దృష్ట్యా ప్రధాని కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వద్ద ప్రస్తుతం 700 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, ఇప్పటికే ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్ నిర్మాణానికి టెండర్లు వేశామని కేంద్ర మంత్రి వివరించారు. రన్వే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. రాబోయే మూడు, నాలుగు వారాల్లో మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ కోసం కూడా టెండర్లు పిలిచి పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తామన్నారు. జూన్ 2, 2028 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు నిర్దేశిత టైమ్లైన్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ సంస్కృతి, కాకతీయ కట్టడాలు, అక్కడి ఆలయాల వైభవం ఉట్టిపడేలా టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఏవియేషన్ రంగాన్ని ఒక హబ్గా మార్చాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, ఆయన ప్రధాని అయ్యాక దేశంలో 90కి పైగా ఎయిర్పోర్టులు నిర్మించామని, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న తెలంగాణ ఎయిర్పోర్టుల అభివృద్ధి తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Also Read
ఇదే సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పైన కూడా కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రక్షణ శాఖ (డిఫెన్స్) ఆధీనంలో ఉందని, దీనిపై ఇప్పటికే తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి మరో 1,500 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. భూసేకరణ పూర్తయితే ఆదిలాబాద్లో సివిల్ ఎయిర్పోర్ట్తో పాటు డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుందని, దీనికోసం కేంద్రం తరపున పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత విమానాశ్రయాలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటని కేంద్రమంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా విమానయాన మౌలిక వసతులు భారీగా పెరుగుతున్నాయని, రానున్న పదేళ్లలో ‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా రూ. 30,000 కోట్లు ఖర్చు చేసి మరో 100 కొత్త ఎయిర్పోర్టులను నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!