NTV WebDesk
Author- NTV Telugu-
తాలిబన్ల లిస్ట్లో ఆ మహిళలు…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు వశం చేసుకున్నారు. ఈరోజు నుంచి వారి పాలన మొదలైంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేశారు. అందరిని గౌవరవిస్తామని, మహిళలకు వారి హక్కులకు భంగం కలుగకుండా చూస్తామని చెబుతూనే, వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో కంటే ఈసారి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అమలులో ఉన్న సమయంలో అనేక మంది మహిళలు అశ్లీల చిత్రాల్లో నటిస్తూ జీవనం సాగించారు. సెక్స్ వర్కర్లుగా జీవితాన్ని కొనసాగించిన మహిళలు కాబూల్లో వేలాది […] -
సెప్టెంబర్ 10 నాటికి 100 శాతం వ్యాక్సినేషన్…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ కోటి మంది వరకు టీకాలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలను ఒపెన్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్ధి, ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ టీకాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానోపాద్యాయులు, పీహెచ్సీలు సమన్వయంతో టీకాలు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 10 వ తేదీలోగా విద్యాసంస్థల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలని ఆదేశించింది. […] -
జోరు వానలో వాహనాలను స్పీడుగా నడుపుతున్నారా… జరా భద్రం…
మామూలు సమయాల్లో సాధారణ వేగంతో వెళ్లే వ్యక్తులు, కాస్తంత వర్షం కురవగానే యమా స్పీడుగా దూసుకుపోవాలని చూస్తుంటారు. వర్షం పెరగకముందే ఇంటికి చేరుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇంటికి చేరుకోవాలని అనుకోవడం మంచిదే. కానీ, దానికోసం పరిమితికి మించి వేగంగా వాహనం నడిపితే ఎన్ని అనర్ధాలు వస్తాయో చెప్పక్కర్లేదు. నగరంలో ఎక్కడ గోతులు ఉంటాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఒపెన్ చేసి ఉంటాయో చెప్పడం కష్టం. ఇక, వర్షం కురిసిన సమయంలో వాటిని గుర్తించడం మహాకష్టం. వర్షం కురిసేటప్పుడు వేగంగా […] -
కేరళలో కరోనా టెర్రర్…సండే లాక్డౌన్…
కేరళలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కట్టడి కోసం నైట్ కర్ఫ్యూను విధించినప్పటికీ కంట్రోల్ కావడంలేదు. ప్రతిరోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ ముఖ్యమంత్రి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజున రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కరోనా కట్టడిపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆదివారం రోజున లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో […] -
దేశంలో కార్ల ధరలు మళ్లీ పెరగనున్నాయా…!!?
దేశంలో కరోనా తరువాత ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొబైల్, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్ట్యాప్ వంటి వాటి ధరలు కొంతమేర పెరిగాయి. ఇప్పుడు కార్ల ధరలు కూడా పెరగబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ డివైజెస్లో చిప్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. కరోనా కారణంగా వీటి దిగుమతి తగ్గిపోయింది. దీంతో ధరలు పెరిగిపోయాయి. కార్లలో వినియోగించే చిప్స్ ధరలు పెరిగిపోవడంతో కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, […] -
రాజస్థాన్లో కాంగ్రెస్ దూకుడు… పంచాయతీ ఎన్నికల్లో…
రాజస్థాన్ లోని ఆరు జిల్లాల్లో మూడు దశల్లో 1564 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయితీను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 598 పంచాయతీల్లో విజయం సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 490 పంచాయతీల్లో విజయం సాధించింది. ఆర్ఎల్పీ 39, బీఎస్పీ 10, ఎస్సీపీ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఇక ఇండిపెండెంట్లు 250 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో గ్రామస్థాయి నుంచి పట్టు ఉందని మరోసారి నిరూపించుకుంది. […] -
బాబోయ్ ఈ వీడియో చూస్తే గుండెలు జారిపోవడం ఖాయం…పర్వతంపై నుంచి పడినా…
మనం పది అడుగుల ఎత్తు నుంచి కిందపడితే కాలో చేయో ఇరిగిపోతుంది. అలాంటిది ఓ ఎత్తైన పర్వతం నుంచి కిందపడినా దానికి ఏమీ కాలేదు. పైగా పట్టువదలని విక్రమార్కునిలా నోటికి చిక్కిన వేటను వదలకుండా పట్టుకుంది. మామూలుగా చిరుతలకు ఆహరం దొరికితే అసలు వదలవు. ఇక మంచు కొండల్లో వాటికి వేట దొరకడమే చాలా కష్టం. అలాంటిది దొరికితే వదులుతాయా చెప్పండి. మంచు చిరుతకు ఓ జింక కనిపించింది. వేటాడేందుకు చిరుత దూకగా అది తప్పించుకునే ప్రయత్నం […] -
విచిత్రం: ఒకే గ్రామంలో రెండు భాషలు…
ఒక రాష్ట్రంలో అనేక భాషలు ఉండొచ్చు. దేశంలో అనేక భాషలు ఉంటాయి. కానీ, ఒక గ్రామంలో రెండు భాషలు ఉండటం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెప్తాం. కానీ, ఆ గ్రామంలో ప్రజలు రెండు భాషలు మాట్లాడతారు. అందులోనూ పురుషులు ఒక భాష మాట్లాడితే, మహిళలు మరో భాష మాట్లాడతారు. ఇద్దరూ రెండు రకాల భాషలు మాట్లాడటం విశేషం. ఆఫ్రికా దేశంలోని నైజీరియాలో ఉన్న ఉబాంగ్ అనే గ్రామంలో ఇలా రెండు రకాల భాషలు మాట్లాడతారట. మహిళలు […] -
రివర్స్ బైక్…సోషల్ మీడియాలో హల్చల్…
బైక్ స్టంట్ చేసేవారు వివిధ రకాలుగా బైక్స్ను నడుపుతుంటారు. బైక్పై నిలబడి, పడుకొని, ముందు చక్రాన్ని ఎత్తి, లేదా వెనుక చక్రాన్ని గాల్లో నిలబెట్టి బైక్ నడుపుతూ స్టంట్ చేస్తుంటారు. బైక్ పై ఎన్ని విన్యాసాలు చేసినా రివర్స్లో నడపడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పాలి. కానీ, ఆ కష్టమైన దాన్ని ఓ వ్యక్తి ఇష్టంగా చేసి చూపించాడు. తన తెలివికి పదునుపెట్టి స్కూటీకి రెండు వైపులా హ్యాండిల్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. […] -
డిసెంబర్ నుంచి వంటనూనె ధరలు తగ్గనున్నాయా…?
కరోనా సమయంలో దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే రెండు నెలల క్రితం కొంతమేర ఆ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వంటనూనెల తయారీలో వినియోగించే పామాయిల్ గింజలు, సోయాబీన్స్ వంటి వాటిని బయోప్యూయల్గా వినియోగించడానికి ఎక్కవ ఆసక్తి చూపుతుండటంతో అంతర్జాతీయంగా నూనెల ధరలు పెరిగాయి. అయితే, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి […]
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?