రక్షాబంధన్ రోజుల అన్నయ్యలకు అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. అన్ని విధాలుగా అన్న తోడుగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా రాఖీని కడతారు. అయితే, బీహార్ అక్కడి ప్రభుత్వం గత కొన్ని సంవత్సారాలుగా రాఖీ పండుగ రోజున సీఎంతో సహా అనేకమంది మంత్రులు అధికారులు చెట్లకు రాఖీలు కడుతున్నారు. రక్షాబంధన్ రోజును వృక్షరక్షాబంధన్ దివస్ పేరుతో చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం 2012 నుంచి ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త చెట్లను నాటడం, వాటికి రాఖీలు కట్టి కంటికి రెప్పలా వాటిని కాపాడడం చేస్తున్నారు.