NTV WebDesk
Author- NTV Telugu-
ఎటు చూసినా గంజాయ్.. స్మగ్లర్లకు పోలీసుల చెక్
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి […] -
వైరల్: పాముకాటుకు నాటుకోడి వైద్యం…
పాము కరిస్తే వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లి యాంటీ పాయిజన్ ఐవీ ఇంజెక్షన్ చేయించాలి. అలా ఇంజెక్షన్ను చేయించడం వలన ప్రాణాలతో బయటపడొచ్చు. పాము కరిచిన వెంటనే దాని పైభాగంతో గుడ్డతో గడ్డిగా కట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లేదంటే విషం పైకి పాకే ప్రమాదం ఉంటుంది. విషాన్ని వీలైనంత త్వరగా బయటకు తీసేయ్యాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం. అయితే, ఖమ్మం జిల్లాలోని బోలకల్ మండలంలోని కలకోట గ్రామంలో పాము కరిచిన వారికి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇలా […] -
కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 2 లక్షలు …15న చెక్కుల పంపిణీ
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మార్చి నుండి […] -
3540 కిమీ 120 బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసిన బామ్మ… ఎలాగంటే…
బస్సుల్లో ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. తప్పనిసరి అనుకుంటే ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారు బస్సు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సుల్లో లాంగ్ జర్నీ చేయాలంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే, ఇంగ్లాండ్కు చెందిన ఈ బామ్మ టికెట్ లేకుండా ఫ్రీగా 3540 కిమీ ప్రయాణం చేసింది. 120 బస్సుల్లో ఒక్కసారి కూడా టికెట్ కొనకుండా ఫ్రీగా ప్రయాణం చేసిందట. అదెలా సాధ్యం అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్నా. ఇంగ్లాండ్లో […] -
ఈ చూయింగ్ గమ్తో కరోనా వ్యాప్తికి చెక్
చాలామందికి చూయింగ్ గమ్ తినే అలవాటు వుంటుంది. యూత్లో ఇది మరీ ఎక్కువ. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పరిశోధకులు ఆశాజనక ఫలితాలు సాధించారు. ఇటీవల ప్రచురితం అయిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిచేస్తున్నాయి. కరోనా సోకినా వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాల ఆధారాలు చెబుతున్నాయి. అందువల్ల యూఎస్ పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్ రూపొందించారు. దీని సహాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని […] -
ఒమిక్రాన్ భయానికి స్పైక్ ప్రోటీన్లో మార్పులే కారణమా…!!
ఒమిక్రాన్ టెన్షన్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. డెల్టా నుంచి బయటపడేలోగా ఒమిక్రాన్ వేరియంట్ ఇబ్బందులు పెడుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్లో 8 రకాల మ్యూటేషన్లు ఉంటే, ఒమిక్రాన్లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయి. అంతేకాదు, డెల్టా వేరియంట్ వ్యాప్తి రేటు 1.47 ఉంటే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు 1.97గా ఉంది. ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది. డెల్టా విజృంభించిన సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. […] -
ధాన్యం కొనుగోలుపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని […] -
మూన్ మిషన్ 2031 కోసం భారీ బూస్టర్లకు నాసా ఆర్డర్…
చంద్రుడిపై కాలు మోపేందుకు, కాలనీలు ఏర్పాటు చేసేందుకు నాసా యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం నాసా ఆర్టిమిస్ పేరుతో బృహత్కర ప్రాజెక్టును చేపట్టింది. ఆర్టిమిస్ ప్రాజెక్టులో భాగంగా 2022లో మానవరహిత రాకెట్ను చంద్రునిమీదకు పంపించబోతున్నది. అనంతరం 2024 నుంచి మానవసహిత రాకెట్లను చంద్రునిమీదకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆర్టిమిస్ 9 కోసం భారీ బూస్టర్లకు పెద్ద ఎత్తున ఆర్డర్లు చేసింది. నార్తరప్ గ్రూమన్ కు ఈ బూస్టర్ల తయారీ బాధ్యతలను అప్పగించింది. నాసా ప్రాజెక్టులకు […] -
అధికారుల వేధింపులు.. వాచర్ ఆత్మహత్యాయత్నం
అధికారులు వేధిస్తున్నారంటూ అటవీశాఖ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వాచర్, ఈ ఘటన కామారెడ్డిలో సంచలనం కలిగించింది. ఎల్లారెడ్డిలో అటవీశాఖ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఫిబ్రవరిలో తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని రవీందర్ వాపోతున్నాడు. ఎఫ్బీవో శ్రీనివాస్, ఎఫ్ ఆర్ఐ విద్యాసాగర్ వేధించి ఉద్యోగం తొలగించారంటున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అంతా అవాక్కయ్యారు. కావాలని రాద్ధాంతం చేస్తున్నాడని అధికారులు అంటున్నారు. ఉద్యోగం నుంచి తొలగించినా యూనిఫాం వదలడం లేదంటున్నారు. -
చోలే బచూర్.. ఇండియాలో రూ.80.. స్వీడన్లో ఎంతంటే?
నార్త్ ఇండియా వెళ్లామంటే రోడ్డు పక్కన మసాలా వాసన, చోలే బచూర్ తినకుండా రాలేం. అత్యంత ప్రజాదరణ పొందిన వీధి ఆహారాలలో చోలే బచూర్ ఒకటిగా చెబుతారు. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల్లో స్ట్రీట్ ఫుడ్స్ లో చోలే బచూర్ ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. అక్కడి భిన్న సంస్కృతుల మేళవింపు ఆహారవైవిధ్యంలోను కనిపిస్తుంది. చోలే బచూర్ (పూరీ, శెనగల కర్రీ), ఛాట్స్, బటర్ చికెన్, రజ్మాచావ్లా, పరోటా తినకుండా వెనక్కి రాలేము. రకరకాల […]
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!