ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలి. రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం జగన్. వ్యవసాయ అనుబంధ రంగాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులకు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయి. వీటిని నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ వ్యవహారాల్లో ఉద్యోగులు ప్రమేయం ఉంటే.. వారిని తొలగించడమే కాదు.. చట్టంముందు నిలబెడతామని జగన్ హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు.
దీనికోసం చట్టంలో మార్పులు, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి. వరి పండిస్తే… వచ్చే ఆదాయం మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి. మిల్లెట్స్ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి. మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. మిల్లెట్స్ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు.
రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి. రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురండి. ఆర్బీకే యూనిట్గా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున సీహెచ్సీలో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి. సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఖరీఫ్లో 1.12 కోట్ల ఎకరాల ఇ–క్రాప్ జరిగిందన్నారు. 45,35,102 మంది రైతులు ఇ– క్రాప్ చేయించుకున్నారని జగన్ తెలిపారు.