Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం..
- శ్రీశైలంలో చిరుత కలకలం..
- రాత్రి వేళ మెట్ల మార్గంలో ఒంటరిగా వెళ్లొద్దు..
- చిన్న పిల్లలను బయటకు పంపవద్దు..
- గుంపులుగా మాత్రమే పాతాళగంగకు వెళ్లండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్థానికులు, భక్తులకు అలర్ట్ జారీ చేశారు.. శ్రీశైలం వచ్చే భక్తులు.. ముఖ్యంగా పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.. అయితే, శ్రీశైలంలోని ఆదే గృహంలో గతంలో కూడా పలు సార్లు చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
మొత్తంగా.. పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం భక్తులు, స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. పాతాళగంగకు వెళ్లే మెట్ల మార్గం సమీపంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంటి పరిసరాల్లో చిరుత తిరుగుతున్న వీడియో బయటకు రావడంతో, ఆలయ పట్టణంలో ఒక్కసారిగా భయ వాతావరణం నెలకొంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు, దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలు, మెట్ల మార్గంలో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. రాత్రి వేళ ఒంటరిగా సంచరించవద్దని, చిన్న పిల్లలను బయటకు పంపవద్దని సూచనలు జారీ చేశారు. చిరుత కదలికలు నమోదైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి, ట్రాప్ కెమెరాలు, పాదముద్రల పరిశీలన, గస్తీ పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మెట్ల మార్గం ప్రాంతం కావడంతో, రక్షణ చర్యలు మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!