Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం..
- శ్రీశైలంలో చిరుత కలకలం..
- రాత్రి వేళ మెట్ల మార్గంలో ఒంటరిగా వెళ్లొద్దు..
- చిన్న పిల్లలను బయటకు పంపవద్దు..
- గుంపులుగా మాత్రమే పాతాళగంగకు వెళ్లండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్థానికులు, భక్తులకు అలర్ట్ జారీ చేశారు.. శ్రీశైలం వచ్చే భక్తులు.. ముఖ్యంగా పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.. అయితే, శ్రీశైలంలోని ఆదే గృహంలో గతంలో కూడా పలు సార్లు చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
మొత్తంగా.. పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం భక్తులు, స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. పాతాళగంగకు వెళ్లే మెట్ల మార్గం సమీపంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంటి పరిసరాల్లో చిరుత తిరుగుతున్న వీడియో బయటకు రావడంతో, ఆలయ పట్టణంలో ఒక్కసారిగా భయ వాతావరణం నెలకొంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు, దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలు, మెట్ల మార్గంలో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. రాత్రి వేళ ఒంటరిగా సంచరించవద్దని, చిన్న పిల్లలను బయటకు పంపవద్దని సూచనలు జారీ చేశారు. చిరుత కదలికలు నమోదైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి, ట్రాప్ కెమెరాలు, పాదముద్రల పరిశీలన, గస్తీ పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మెట్ల మార్గం ప్రాంతం కావడంతో, రక్షణ చర్యలు మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!