Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం..
- శ్రీశైలంలో చిరుత కలకలం..
- రాత్రి వేళ మెట్ల మార్గంలో ఒంటరిగా వెళ్లొద్దు..
- చిన్న పిల్లలను బయటకు పంపవద్దు..
- గుంపులుగా మాత్రమే పాతాళగంగకు వెళ్లండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్థానికులు, భక్తులకు అలర్ట్ జారీ చేశారు.. శ్రీశైలం వచ్చే భక్తులు.. ముఖ్యంగా పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.. అయితే, శ్రీశైలంలోని ఆదే గృహంలో గతంలో కూడా పలు సార్లు చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
మొత్తంగా.. పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం భక్తులు, స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. పాతాళగంగకు వెళ్లే మెట్ల మార్గం సమీపంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంటి పరిసరాల్లో చిరుత తిరుగుతున్న వీడియో బయటకు రావడంతో, ఆలయ పట్టణంలో ఒక్కసారిగా భయ వాతావరణం నెలకొంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు, దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలు, మెట్ల మార్గంలో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. రాత్రి వేళ ఒంటరిగా సంచరించవద్దని, చిన్న పిల్లలను బయటకు పంపవద్దని సూచనలు జారీ చేశారు. చిరుత కదలికలు నమోదైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి, ట్రాప్ కెమెరాలు, పాదముద్రల పరిశీలన, గస్తీ పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మెట్ల మార్గం ప్రాంతం కావడంతో, రక్షణ చర్యలు మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
-
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు..!
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..