Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం..
- శ్రీశైలంలో చిరుత కలకలం..
- రాత్రి వేళ మెట్ల మార్గంలో ఒంటరిగా వెళ్లొద్దు..
- చిన్న పిల్లలను బయటకు పంపవద్దు..
- గుంపులుగా మాత్రమే పాతాళగంగకు వెళ్లండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్థానికులు, భక్తులకు అలర్ట్ జారీ చేశారు.. శ్రీశైలం వచ్చే భక్తులు.. ముఖ్యంగా పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.. అయితే, శ్రీశైలంలోని ఆదే గృహంలో గతంలో కూడా పలు సార్లు చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
మొత్తంగా.. పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం భక్తులు, స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. పాతాళగంగకు వెళ్లే మెట్ల మార్గం సమీపంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంటి పరిసరాల్లో చిరుత తిరుగుతున్న వీడియో బయటకు రావడంతో, ఆలయ పట్టణంలో ఒక్కసారిగా భయ వాతావరణం నెలకొంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు, దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలు, మెట్ల మార్గంలో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. రాత్రి వేళ ఒంటరిగా సంచరించవద్దని, చిన్న పిల్లలను బయటకు పంపవద్దని సూచనలు జారీ చేశారు. చిరుత కదలికలు నమోదైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి, ట్రాప్ కెమెరాలు, పాదముద్రల పరిశీలన, గస్తీ పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మెట్ల మార్గం ప్రాంతం కావడంతో, రక్షణ చర్యలు మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!