NTV WebDesk
Author- NTV Telugu-
నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన…
ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించబోతున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత జెడ్పీ బాలుర హైస్కూల్లో జరిగే బహిరంగ సభకు జగన్ హాజరయ్యి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. Read: భారత్ బయోటెక్ బూస్టర్ డోస్… ఇంజెక్షన్ రూపంలో కాకుండా… […] -
భారత్ బయోటెక్ బూస్టర్ డోస్… ఇంజెక్షన్ రూపంలో కాకుండా…
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ను ఇంజెక్షన్ రూపంలో రెండు డోసులుగా అందించారు. అయితే, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసులను అందిస్తున్నారు. భారత్ బయోటెక్ బూస్టర్ డోసులను ఇంజెక్షన్ రూపంలో కాకుండా చుక్కల మందు రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నది. Read: What’s Today : ఈ రోజు […] -
దలైలామాను కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం ప్రముఖ టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. మెక్లీడ్గంజ్లోని దలైలామా నివాసంలో సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దలైలామా ఎవరితోనే ప్రత్యక్షంగా ఎవరినీ కలువ లేదు. ఈ నెల 15న నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. ప్రవాస టిబెటన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కలిశారు. […] -
వైకుంఠ ఏకాదశి లోపు తిరుమల ఘాట్ రోడ్డు పనులు పూర్తి
వైకుంఠ ఏకాదశిలోపు ఘాటు రోడ్ పనులు పూర్తిచేస్తామంటోంది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. తుఫాన్ కారణంగా ఏర్పడిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు పాడైంది. తిరుమల రెండో ఘాట్ మరమ్మతులు ఈ నెలాఖరులోపు పూర్తిచేసి, వైకుంఠ ఏకాదశిలోపు వాహన రాకపోకలకు అనుమతివ్వాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 7,8,9,14,15వ కిలోమీటర్ల వద్ద త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ […] -
55 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 6 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా భావిస్తుంది. కాగ రాష్ట్రం లో మొత్తం అన్ని శాఖలలో 86 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని తెలుస్తుంది. అయితే అందులో కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ ఉద్యోగాలు మినహా మిగితా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. […] -
ఖరీదైన టూర్: 12 రోజుల ప్రయాణానికి రూ. 600 కోట్లు ఖర్చు…
కొన్ని ప్రయాణాలు చాలా ఖరీదైనవి. అలాంటి ప్రయాణాల్లో ఇదికూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతరిక్ష రంగంలో అనేక ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా రాకెట్లు, స్టార్షిప్ వంటి వాటిని తయారు చేస్తున్నారు. అంతరిక్ష రంగం కమర్షియల్గా లాభసాటిగా మారింది. ప్రపంచ కుబేరులు అంతరిక్షంలో ప్రయాణం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి వారిలో జపాన్కు చెందిన మెజువా కూడా ఒకరు. Read: ఒమిక్రాన్ దెబ్బకు మరో అంతర్జాతీయ సమావేశం వాయిదా… మెజువా డిసెంబర్ 8 […] -
యూపీలో కోటి మందికి స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల పంపిణీ
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది. యూపీ సీఎం యోగి […] -
ఒమిక్రాన్ దెబ్బకు మరో అంతర్జాతీయ సమావేశం వాయిదా…
ఒమిక్రాన్ కేసులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇప్పటికే 90కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూరప్లోని కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. జనసంచారంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్క్, శానిటైజర్లు తప్పనిసరి చేశారు. ఒమిక్రాన్ కారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. Read: వాహనప్రియులకు శుభవార్త: 2022 లో ఎలక్ట్రిక్ కార్ల హంగామ షురూ… 2022 జనవరి 17 నుంచి 21 […] -
కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తుంది: కొప్పుల ఈశ్వర్
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ హాజరయ్యారు. కరీంనగర్- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా […] -
జనవరి 1 నుంచి మారనున్న డెబిట్, క్రెడిట్ కార్డు రూల్స్ ఇవే!
ఈరోజుల్లో అన్నీ ఆన్ లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తుంటాం. అయితే, జనవరి1, 2022 నుంచి కొన్ని నిబంధనలు మారబోతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి. జనవరి 1, 2022 నుండి బ్యాంక్ ఖాతాదారులు తమ కార్డ్ నంబర్, గడువు తేదీ మొదలైన వాటి వివరాలను గూగుల్ సేవ్ చేయదు. అటువంటి పరిస్థితిలో, జనవరి 1 నుండి మాన్యువల్ ఆన్లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు, మీరు మాన్యువల్గా మీ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!