రఘురామపై వైసీపీ ఎంపీల వార్.. కేసులు త్వరగా విచారించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ రెబల్ ఎంపీ, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారణ చేయాలన్నారు. లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ.వీ. మిథున్రెడ్డి ఈమేరకు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీలు నిరసన తెలిపారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాంస్టర్ రఘురామకృష్ణరాజు. “భారత్ థర్మల్” పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు మిథున్ రెడ్డి.
చట్టసభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరి కాదు. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశారు. వాటి నుంచి బయట పడడం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నుంచి ఎంపీగా ఆయన గెలిచారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు మిథున్ రెడ్డి.
Also Read
బ్యాంకులను మోసం చేశారు. కాబట్టి, ఆ కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల నేను మీ (స్పీకర్ ఛైర్) ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. “భారత్ థర్మల్” పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?