NTV WebDesk
Author- NTV Telugu-
అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్… ప్రతి 18 నిమిషాలకొకసారి…
విశాలమైన ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. మనిషి ఒంటరి జీవి కాదని, విశ్వంలో మరో జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికోసం అనేక ప్రాంతాల్లో రేడియో రిసీవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా సుమారు నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి రేడియో తరంగాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. […] -
తిరిగి మేమే అధికారంలోకి వస్తాం: జీవీఎల్
ప్రస్తుతం జరగోబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో తిరిగి అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. పంజాబ్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ అన్నారు. బీజేపీ కూటమికి ప్రజలు పంజాబ్లో అధికారం అప్పగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏదిఏమైనా, పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర […] -
వైరల్: ఆ ఇల్లు తలక్రిందులైంది… ఎలానో తెలుసా…
సాధారణంగా ఇల్లు ఇల్లులా కట్టుకుంటే నివశించడానికి అనువుగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా, కట్టుకుంటే, అందులో కూడా నివశించవచ్చు. కాకపోతే నివశించేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మామూలు ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాంటిది ఇంటిని తలకిందులుగా కట్టాలి అంటే చాలా కష్టం. అంతేకాదు, అందులోని వస్తువులు కూడా తలక్రిందులుగా ఉంటే… చెప్పాల్సింది ఏముంది సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయమే. కొలంబియాకు చెందిన ఫ్రిట్జ్ స్కాల్ అనే పెద్దాయన ఇంటిని అందరికంటే […] -
అమెరికాకు జఠిలంగా మారిన ఉక్రెయిన్ సమస్య…
30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ను తిరిగి రష్యా తన భూభాగంలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సుమారు లక్ష సైన్యాన్ని రష్యా మోహరించింది. అయితే, అయితే, ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే సైనికసాయం అందిస్తామని అంటోంది. ఇప్పటికే 8500 మంది సైనికులను బాల్టిక్ సముద్రంలో మోహరించింది. అయితే, సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్కు తరలించేందుకు అమెరికా ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. సోవియట్ […] -
5 నిమిషాల్లో రూ. 4 లక్షల కోట్లు…
ఎప్పుడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్చి నెలలో వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంకు సూచించడంతో దాని ప్రభావం మార్కెట్పై పడింది. ఆసియా మార్కెట్తో పాటు ఇండియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో రూ. 4 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రారంభమైన వెంటనే 1100 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణం గరిష్టస్ధాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి […] -
పారాసిటమాల్ జ్వరానికే కాదు… పాములను చంపేందుకు కూడా ఉపయోగిస్తారట…
పారాసిటమాల్ టాబ్లెట్ ను జ్వరానికి వినియోగిస్తారు. కరోనా కాలంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. జ్వరం, తలనొప్పి, చిన్నపాటి ఒళ్లునొప్పులు వచ్చినా వెంటనే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. అయితే, పారసిటమాల్ ట్యాబ్లెట్లను జ్వరానికి మాత్రమే కాదు, పాములు చంపడానికి కూడా వినియోగిస్తున్నారట. అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ పాములు లక్షల సంఖ్యలో ఉన్నాయి. 1950 కాలంలో తొలి బ్రౌన్ట్రీ స్నేక్ను గుర్తించారు. 40 ఏళ్ల కాలంలో ఈ గువామ్ దీవిలో లక్షల సంఖ్యలో […] -
అద్భుతం: 20 వేల సంవత్సరాలనాటి మమ్మీ కడుపులో…
ఈజిప్ట్ అనగానే మనకు పెద్ద పెద్ద పిరమిడ్లు, మమ్మీలు గుర్తుకు వస్తాయి. పిరమిడ్ల నుంచి ఎన్నో మమ్మీలను బయటకు తీసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే, ఇటీవలే మమ్మఫికేషన్ సహాయంతో సుమారు 20 వేల ఏళ్లనాటి మమ్మీకడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్సా విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు సీటీ ఎక్స్ రే సహాయంతో మమ్మీ కడుపులోని పిండం అవశేషాల ఉనికిని గుర్తించారు. చనిపోయిన మహిళ ప్రసవం సమయంలో చనిపోలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళ చనిపోవడానికి […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే..?
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 2,86,384 కేసులు నమోదవ్వగా, 573 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు కాస్త పెరగడం ఊటరనిచ్చేవిషయం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేషన్ […] -
ఇకపై పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే… లేదంటే…
వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుంటే ప్రభుత్వాలు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, జరిమానాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది హాఫ్ హెల్మెట్ను ధరిస్తున్నారు. ఇలా హాఫ్ హెల్మెట్ను ధరించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రమాదాలు జరిగిన సమయంలో హాఫ్ హెల్మెట్ కారణంగా ముఖానికి దెబ్బతగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హెల్మెట్పై బెంగళూరు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నగరంలో 15 రోజులపాటు హెల్మెట్పై అవగాహన కార్యక్రమం […] -
ఆకాశంలో ఎగిరే కార్లు వచ్చేశాయి… ధర ఎంతో తెలుసా?
సాధారణ రోజుల్లో బయటకు వస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ట్రాఫిక్లో ఆగిపోవాల్సి వస్తుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా ఎగిరే కార్లు వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి కదా అనుకున్నాం. కాగా, త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ […]
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!