భవిష్యత్ భారత నిర్మాణానికి పునాది ఈ బడ్జెట్: డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడారు.దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మనిర్భర భారత్ సాధికారత సాధ్యమయ్యేలా బడ్జెట్ రూప కల్పన చేశారన్నారు. పీఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుండి మొదలుకుని ఆవాస్ యోజన ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం 48 వేల కోట్లు కేటాయించడం వరకు ప్రతీది దేశంలో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా బడ్జెట్ నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగిందన్నారు. రాష్ట్రాలకు వడ్డీ లేకుండా ఋణ సౌకర్యం కోసం లక్ష కోట్లు కేటాయించడం, కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్రాలలోని ఉద్యోగులకు ఎన్ పీఎస్ డిడక్షన్ చేయడానికి నిర్ణయించడం, రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం 10.68 లక్షల కోట్లు కేటాయించడం సమాఖ్య వ్యవస్థ పై నరేంద్రమోదీ దురదృష్టికి నిదర్శనమన్నారు.
వరి, గోధుమల మద్దతు ధర కోసం 2.37 లక్షల కోట్ల కేటాయింపు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచడం, అద్దె పద్దతిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించడం, ల్యాండ్ రికార్డుల ఆధునీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడం, నదుల అనుసంధానం కోసం పూర్తి స్థాయి సన్నద్ధతతో బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. పీఎం ఈ – విద్యకోసం 200 ఛానెల్స్ ఏర్పాటు చేయడం, డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిర్ణయించడం, దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంక్ ల ఏర్పాటు, MSME ల ఉత్పత్తుల అమ్మకం కోసం ప్రత్యేక పోర్టల్, అన్ని గ్రామాలకు భారత్ నెట్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్, అనేవి భారతదేశాన్ని ఆధునీకరించడంలో కీలక అడుగుగా ఈ బడ్జెట్ను భావించొవచ్చన్నారు. మిషన్ శక్తి , మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్, పోషన్ అభియాన్ 2.0 లాంటి పథకాలను నూతనంగా ప్రవేశపెట్టడం మహిళా, శిశు సాధికారత సాధన లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. దేశంలో ముఖ్యమైన 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో నిపుణుల అంచనాలకు భిన్నంగా తాయిలాల బడ్జెట్ కాకుండా అభివృద్ధి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మోడీ అంకిత భావానికి నిదర్శనమని డీకే అరుణ పేర్కొన్నారు.
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
తాజావార్తలు
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..