యూకే నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎంపికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
దీపావళి పండుగ వేళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉగ్రకుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కోయబత్తూరులో ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలుగులు చిందించింది. ఈ సారి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయు నది ఒడ్డున 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామాలను కోరారు.
జులై మధ్యలో కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయ టెకీలను పోలీసు ప్రత్యేక విభాగం చంపినట్లు అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు తెలిపారు. బాలాజీ టెలిఫిల్మ్స్ మాజీ సీవోవో జుల్ఫికర్ ఖాన్, మరొక భారతీయుడు మొహమ్మద్ జైద్ సమీ కిద్వాయ్ రెండు నెలల క్రితం నైరోబీలో ఓ క్లబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు.
దక్షిణాసియాలో మొదటి డిస్నీల్యాండ్ను హంబన్టోటాలో ఏర్పాటు చేయడంపై చర్చలు జరపడానికి డిస్నీల్యాండ్ బృందం నవంబర్లో శ్రీలంకను సందర్శించేందుకు అంగీకరించింది. శ్రీలంకలో డిస్నీల్యాండ్ను ప్రారంభించేందుకు డిస్నీల్యాండ్ అధికారులు తనతో చర్చలు జరుపుతున్నట్లు ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి డయానా గమేజ్ గతంలో తెలిపారు.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.