Tamilnadu: దీపావళి వేళ ఉగ్ర కుట్ర ప్లాన్?.. కారులో గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనపై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: దీపావళి పండుగ వేళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉగ్రకుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కోయబత్తూరులో ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన యువకుడు 25 ఏళ్ల జమేషా ముబిన్గా గుర్తించారు. 2019లో ఈ ముబిన్ను ఎన్ఐఏ విచారించినట్లు తెలిసింది. ముబిన్ ఇంటిలో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ లాంటి నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పేలిన కారు వివరాల గురించి పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఆ కారు ఇప్పటివరకు 9 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. భవిషత్తులో ఏదో ప్లాన్ చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు అన్నారు. ఈ ఘటన ప్రమాదమా లేక కుట్ర జరిగిందా అనే కోణంలో వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీజీపీ సి. శైలేంద్రబాబు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును తమిళనాడు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఆదివారం కోయంబత్తూరు నగరంలోని మతపరంగా సున్నితమైన ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ వ్యక్తి కాలి బూడిదయ్యాడు. డీజీపీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన ప్రమాదమా లేక ‘కుట్ర’ జరిగిందా అనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా డీజీపీ సి. శైలేంద్రబాబు తెలిపారు. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం సమీపంలో ఈ సంఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. మతపరమైన సున్నితమైన ప్రాంతం కావడంతో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించిన ఉక్కడం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. “రెండు సిలిండర్లు ఉన్నాయి. ఒకటి పేలింది. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నాం. ప్రమేయం ఉన్న కారు యాజమాన్యాన్ని మార్చింది (చాలా సార్లు). మేము యజమానిని ట్రేస్ చేస్తున్నాము. మృతుడి గుర్తింపును గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది’’ అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Also Read
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
Ayodhya Sets World Record: అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డు.. సరయూ నది ఒడ్డున 15 లక్షల దీపాలు
తమిళనాడు కమాండో స్కూల్కు చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విచారణలో చేరినప్పటికీ, కోయంబత్తూరు కమిషనర్ వి.బాలకృష్ణన్ ఆధ్వర్యంలోని ఆరు ప్రత్యేక బృందాలు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాయి. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు అవకాశం ఏమిటని ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేమని బాబు చెప్పారు. పేలిన కారు అవశేషాల నుంచి రాళ్లు, మేకులు దొరకడంపై అడిగిన ప్రశ్నకు, బాంబు నిర్వీర్య దళం, ఫోరెన్సిక్ నిపుణులు, స్నిఫర్ డాగ్లను రంగంలోకి దించామని విచారణ అనంతరం అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. వాహనం స్పీడ్ బ్రేకర్ దాటి వెళ్లిన వెంటనే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి పేలుడుకు దారితీసిందన్న నివేదికలపై, ఉగ్ర కుట్రతో సహా అన్ని కోణాలను విచారిస్తామని, విచారణ పూర్తయిన తర్వాతే నిర్ధారణకు రాగలమని చెప్పారు. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!