PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi in Ayodhya: దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా “సబ్కా సాత్ సబ్కా వికాస్” ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈసారి దీపావళి వచ్చిందన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ జరుపుకుంటున్న తరుణంలో శ్రీరాముడి వంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న బ్రిటీష్ కాలం నాటి రాజ్పథ్ పేరు మార్చడం వెనుక స్పూర్తి రాముడు అని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రాముడిని కోరుకున్నానన్నారు. మన దేశంలోని సంస్కృతి ఇంకెకక్కడా లేదన్నారు.
ఈరోజు దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని అయోధ్య చేరుకున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, స్ఫూర్తితో అయోధ్య దీపోత్సవం ప్రారంభమైందని.. ఈ ఉత్తరప్రదేశ్ పండుగ దేశానికే పండుగగా మారిందని.. నేడు కొత్త శిఖరాలను తాకుతోందన్నారు. చేరుకున్న ప్రధాని మోదీ ఆదివారం ఇక్కడ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని పరిశీలించారు. శ్రీరామ జన్మభూమిలో రామలాలా విరాజ్మన్కు ప్రార్థనలు చేశారు. సరయూ నది ఒడ్డున జరిగిన హారతిలో ప్రధాని పాల్గొన్నారు, అనంతరం వేడుకలు ప్రారంభమయ్యాయి. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా దీపాలను వెలిగిస్తున్నారు. పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో కొన్ని దీపాలను ఉంచారు.
Also Read
- Ram Charan: ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్కు మంత్రి!
- Ashwin: "సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
Arvind Kejriwal: ప్రధాని మోడీకి కేజ్రీవాల్ కౌంటర్.. ఉచితాలని చెప్పి సామాన్యుడిని అవమానించొద్దు..
రికార్డులను నెలకొల్పేందుకు దీపోత్సవంలో లెక్కలేనన్ని స్వదేశీ, అన్యదేశ పుష్పాలతో అయోధ్యను అలంకరించారు. దీపోత్సవ్ 2022ని మరింత అద్భుతంగా చేయడానికి అయోధ్యలోని ప్రతి కూడలిని పూలతో చేసిన రంగోలిలతో అలంకరించారు. సరయూ నది ఒడ్డును మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. సూర్యుడు అస్తమించిన వెంటనే అద్భుతమైన లైటింగ్తో మిరుమిట్లుగొలిపేలా ఏర్పాట్లు చేశారు. .ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Ram Charan: ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్కు మంత్రి!
-
ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!