Indians Missing: కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indians Missing: జులై మధ్యలో కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయ టెకీలను పోలీసు ప్రత్యేక విభాగం చంపినట్లు అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు తెలిపారు. బాలాజీ టెలిఫిల్మ్స్ మాజీ సీవోవో జుల్ఫికర్ ఖాన్, మరొక భారతీయుడు మొహమ్మద్ జైద్ సమీ కిద్వాయ్ రెండు నెలల క్రితం నైరోబీలో ఓ క్లబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో విలియం రూటో తరఫున ఎన్నికల ప్రచార బృందంలో వీరు చేరినట్లుగా సమాచారం. వీరి మృతి వార్తను కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు డెనిస్ ఇటుంబి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కెన్యా ‘కిల్లర్ పోలీసులే’ వారిని హత్య చేశారని పేర్కొన్నారు.
Sri lanka: దక్షిణాసియాలో ప్రారంభం కానున్న తొలి డిస్నీల్యాండ్
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్తను కెన్యా అధ్యక్షుడి సహాయకుడు ధ్రువీకరించాడు. వీరిద్దరూ నైరోబీలోని క్లబ్ నుంచి గత జూలై నెలలో అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. కాగా, కెన్యా కిల్లర్ పోలీసులే వారిని హత్య చేశారని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. అంతకుముందు, తప్పిపోయిన వ్యక్తులను తిరిగి కనుగొనే ప్రయత్నంలో అపహరణ జరిగిన ప్రదేశం నుంచి సీసీటీవి ఫుటేజీని తిరిగి పొందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విచారణలో సహాయపడేందుకు స్థానిక డిటెక్టివ్ల విభాగాన్ని కూడా ఆశ్రయించారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు వారిద్దరు కారులో వెళ్తుండగా.. డ్రైవర్తో పాటు వీరిని కూడా కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన మూడు రోజుల తర్వాత వారిని చంపినట్లు అధ్యక్షుడి సహాయకుడు ఇటుంబి తన ప్రకటనలో పేర్కొన్నారు. కిడ్నాప్ అనంతరం వారిని నైరోబీకి 150 కిలోమీటర్ల దూరంలోని అబేర్డేర్స్కు పంపారని తెలిపారు. వీరి అదృశ్యంపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చితోపాటు బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏక్తా కపూర్ కూడా కెన్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. వీరి ఆచూకీ కనుగొని భారత్కు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!