Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. కానీ సీసీ కెమెరా పట్టేసింది! ‘షూ’ మ్యాజిక్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అన్న సామెతకు నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన జాయ్ అలుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ షోరూమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లికి చెందిన గోపాలకృష్ణ సీనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అతడు కొంతకాలంగా ఆభరణాల నిల్వలపై కన్నేశాడు. సరైన సమయం చూసి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటనను గోప్యంగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
READ ALSO: Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
సాధారణ ఆడిట్ నిర్వహణలో భాగంగా బంగారు ఆభరణాల నిల్వలో తేడాలు కనిపించడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. అయితే షోరూంలో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఎవరో తేలకపోవడంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది. విషయం బయటకు రాకుండా యాజమాన్యం అంతర్గతంగా రోజూ సీసీటీవీ ఫుటేజీలను గోప్యంగా పరిశీలించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కనుగొన్న తర్వాత జాయ్ ఆలుక్కాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గోపాలకృష్ణ తను కూర్చునే కౌంటర్ దగ్గర ఆభరణాలను ఎవరికి తెలియకుండా కింద పడేసి.. వాటిని సాక్స్లో దాచుకుని షూలో పెట్టుకుని బయటకు వెళ్లేవాడు. ఇలా ప్రతిరోజు దాదాపు 10 గ్రాముల చొప్పున బంగారం తీసుకెళ్లి పది రోజుల్లో ఒక కిలోకు పైగా ఆభరణాలను చోరీ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పోలీసులు గోపాలకృష్ణను … స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో విచారించగా తానే చోరీకి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. షోరూంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా చోరీ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన నగరంలోని జువెలరీ షోరూంల భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు గోపాలకృష్ణ ఒక్కడే ఈ చోరీ చేశాడా? ఈ కేసులో మరెవరైనా అతడికి సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
READ ALSO: Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!