Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. కానీ సీసీ కెమెరా పట్టేసింది! ‘షూ’ మ్యాజిక్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అన్న సామెతకు నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన జాయ్ అలుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ షోరూమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లికి చెందిన గోపాలకృష్ణ సీనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అతడు కొంతకాలంగా ఆభరణాల నిల్వలపై కన్నేశాడు. సరైన సమయం చూసి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటనను గోప్యంగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
READ ALSO: Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
సాధారణ ఆడిట్ నిర్వహణలో భాగంగా బంగారు ఆభరణాల నిల్వలో తేడాలు కనిపించడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. అయితే షోరూంలో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఎవరో తేలకపోవడంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది. విషయం బయటకు రాకుండా యాజమాన్యం అంతర్గతంగా రోజూ సీసీటీవీ ఫుటేజీలను గోప్యంగా పరిశీలించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కనుగొన్న తర్వాత జాయ్ ఆలుక్కాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గోపాలకృష్ణ తను కూర్చునే కౌంటర్ దగ్గర ఆభరణాలను ఎవరికి తెలియకుండా కింద పడేసి.. వాటిని సాక్స్లో దాచుకుని షూలో పెట్టుకుని బయటకు వెళ్లేవాడు. ఇలా ప్రతిరోజు దాదాపు 10 గ్రాముల చొప్పున బంగారం తీసుకెళ్లి పది రోజుల్లో ఒక కిలోకు పైగా ఆభరణాలను చోరీ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పోలీసులు గోపాలకృష్ణను … స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో విచారించగా తానే చోరీకి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. షోరూంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా చోరీ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన నగరంలోని జువెలరీ షోరూంల భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు గోపాలకృష్ణ ఒక్కడే ఈ చోరీ చేశాడా? ఈ కేసులో మరెవరైనా అతడికి సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
READ ALSO: Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!