Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. కానీ సీసీ కెమెరా పట్టేసింది! ‘షూ’ మ్యాజిక్ ఇది..
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అన్న సామెతకు నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన జాయ్ అలుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ షోరూమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లికి చెందిన గోపాలకృష్ణ సీనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అతడు కొంతకాలంగా ఆభరణాల నిల్వలపై కన్నేశాడు. సరైన సమయం చూసి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటనను గోప్యంగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
READ ALSO: Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
సాధారణ ఆడిట్ నిర్వహణలో భాగంగా బంగారు ఆభరణాల నిల్వలో తేడాలు కనిపించడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. అయితే షోరూంలో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఎవరో తేలకపోవడంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది. విషయం బయటకు రాకుండా యాజమాన్యం అంతర్గతంగా రోజూ సీసీటీవీ ఫుటేజీలను గోప్యంగా పరిశీలించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కనుగొన్న తర్వాత జాయ్ ఆలుక్కాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గోపాలకృష్ణ తను కూర్చునే కౌంటర్ దగ్గర ఆభరణాలను ఎవరికి తెలియకుండా కింద పడేసి.. వాటిని సాక్స్లో దాచుకుని షూలో పెట్టుకుని బయటకు వెళ్లేవాడు. ఇలా ప్రతిరోజు దాదాపు 10 గ్రాముల చొప్పున బంగారం తీసుకెళ్లి పది రోజుల్లో ఒక కిలోకు పైగా ఆభరణాలను చోరీ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పోలీసులు గోపాలకృష్ణను … స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో విచారించగా తానే చోరీకి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. షోరూంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా చోరీ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన నగరంలోని జువెలరీ షోరూంల భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు గోపాలకృష్ణ ఒక్కడే ఈ చోరీ చేశాడా? ఈ కేసులో మరెవరైనా అతడికి సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
READ ALSO: Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!