KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పై కేటీఆర్ ఆరోపణలు
- దాడులు, కిడ్నాప్లతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోనని విమర్శ
- ఎక్స్ అఫీషియో ఓట్లపై దొంగ ఓట్ల ఆరోపణ
- పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్కు 100% పర్సంటైల్
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన భౌతిక దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక.. కిడ్నాప్లు, దాడులు , దొంగ ఓట్లతో పదవులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎంపీల ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని చైర్మన్ పదవులను దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.
కొందరు పోలీస్ అధికారులు కాంగ్రెస్ నేతల తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అధికార పార్టీకి అనుకూలంగా చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిస్తున్న ఈ పాలకుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజల కోర్టులో కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు.
Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్కు బెస్ట్ ఆప్షన్.!
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!