KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పై కేటీఆర్ ఆరోపణలు
- దాడులు, కిడ్నాప్లతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోనని విమర్శ
- ఎక్స్ అఫీషియో ఓట్లపై దొంగ ఓట్ల ఆరోపణ
- పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్కు 100% పర్సంటైల్
Also Read
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన భౌతిక దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక.. కిడ్నాప్లు, దాడులు , దొంగ ఓట్లతో పదవులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎంపీల ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని చైర్మన్ పదవులను దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.
కొందరు పోలీస్ అధికారులు కాంగ్రెస్ నేతల తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అధికార పార్టీకి అనుకూలంగా చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిస్తున్న ఈ పాలకుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజల కోర్టులో కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు.
Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్కు బెస్ట్ ఆప్షన్.!
తాజావార్తలు
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ట్రెండింగ్
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!