KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పై కేటీఆర్ ఆరోపణలు
- దాడులు, కిడ్నాప్లతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోనని విమర్శ
- ఎక్స్ అఫీషియో ఓట్లపై దొంగ ఓట్ల ఆరోపణ
- పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్కు 100% పర్సంటైల్
Also Read
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన భౌతిక దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక.. కిడ్నాప్లు, దాడులు , దొంగ ఓట్లతో పదవులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎంపీల ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని చైర్మన్ పదవులను దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.
కొందరు పోలీస్ అధికారులు కాంగ్రెస్ నేతల తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అధికార పార్టీకి అనుకూలంగా చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిస్తున్న ఈ పాలకుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజల కోర్టులో కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు.
Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్కు బెస్ట్ ఆప్షన్.!
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!