KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పై కేటీఆర్ ఆరోపణలు
- దాడులు, కిడ్నాప్లతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోనని విమర్శ
- ఎక్స్ అఫీషియో ఓట్లపై దొంగ ఓట్ల ఆరోపణ
- పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్కు 100% పర్సంటైల్
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన భౌతిక దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక.. కిడ్నాప్లు, దాడులు , దొంగ ఓట్లతో పదవులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎంపీల ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని చైర్మన్ పదవులను దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.
కొందరు పోలీస్ అధికారులు కాంగ్రెస్ నేతల తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అధికార పార్టీకి అనుకూలంగా చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిస్తున్న ఈ పాలకుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజల కోర్టులో కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు.
Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్కు బెస్ట్ ఆప్షన్.!
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!