ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం జరగనుంది. సిమ్లాలోని రాజ్భవన్లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఎట్టకేలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్కార్తీ ఎన్నికయ్యారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్కార్తీకి పలువురు నేతలు మద్దతు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్ను ఎన్నుకున్నారు.
కేరళలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక హోటల్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ వంటకం 'కుజిమంతి'ని తిని ఓ మహిళ ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించిన అనుమానాస్పద కేసులో ప్రాణాలు కోల్పోయింది.
నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్పై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండటం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అగ్రరాజ్యమైన అమెరికాలో గన్కల్చర్ నానాటికి పేట్రేగుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రమైన వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో శుక్రవారం ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.