HYD PUJARIKI JAIL: జైల్లో పూజారి..
- మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
- నిందితునికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD PUJARIKI JAIL: చేసేది గుళ్లో పౌరోహిత్యం.. కానీ ఆ పూజారి కాస్తా.. బంగారం కోసం వైల్డ్ క్రిమినల్గా మారాడు. ఒంటరిగా గుడికి వచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్లోనే హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది.
Read Also: Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా పామురు మండలం బాలసుబ్బయ్యనగర్కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టు మల్కాజిగిరిలోని విష్ణుపురిలో నివాసం ఉంటూ స్థానిక స్వయంభూ సిద్ధివినాయక గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. పేరుకు పూజారే అయినప్పటికీ అతడు చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలయ్యాడు. విష్ణుపురి ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్న గోర్తి వెంకట నారాయణ మూర్తి భార్య ఉమాదేవి రోజూ గుడికి వచ్చేది. దీంతో ఆమెతో కాస్త పరిచయం పెంచుకున్నాడు మురళీ కృష్ణ. కానీ అతని ఆలోచన అంతా ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగల మీదే ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై అతని కన్నుపడింది. వాటిని దొచుకునేందుకు అవకాశం కోసం వేచి చూశాడు మురళీకృష్ణ. అదే ఏడాది ఏప్రిల్ 18న రాత్రి 7.30కు ఆలయానికి వచ్చిన ఆమెను గర్భగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఉమాదేవిపై ఐరన్ రాడ్డుతో బలంగా కొట్టాడు. తలపై గట్టిగా మోది హత్య చేశాడు. ఉమాదేవి ఒంటిపై ఉన్న నగలను కాజే శాడు.
ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేయడానికి భారీ స్కెచ్ వేశాడు పూజారి మురళీ కృష్ణ. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి గర్భగుడిలో దాచి మూడు రోజుల పాటు గుడికి తాళాలు వేసి శుభ్రం చేశాడు. అప్పటికే మృతురాలి భర్త ఫిర్యా దుతో మల్కాజిగిరి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలించారు. మరోవైపు డెడ్ బాడీ కారణంగా.. గుడిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని పూజారి గుడి వెనుక గల చెట్ల పొదల్లో పారేశాడు. మృతురాలి చెప్పులు గుడి బయట లభించడం, పూజారి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నగల కోసమే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. మురళీకృష్ణపై నేరాభియోగ పత్రాన్ని సమర్పించారు. బాధితురాలి తరఫున అడిషనల్ పీపీ ఎస్.కోమలత వాదనలు వినిపించారు. కేసును విచారించిన మల్కాజిగిరి కోర్టు 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి.కిరణ్ కుమార్ మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.7,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!