HYD PUJARIKI JAIL: జైల్లో పూజారి..
- మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
- నిందితునికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష
HYD PUJARIKI JAIL: చేసేది గుళ్లో పౌరోహిత్యం.. కానీ ఆ పూజారి కాస్తా.. బంగారం కోసం వైల్డ్ క్రిమినల్గా మారాడు. ఒంటరిగా గుడికి వచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్లోనే హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది.
Read Also: Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా పామురు మండలం బాలసుబ్బయ్యనగర్కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టు మల్కాజిగిరిలోని విష్ణుపురిలో నివాసం ఉంటూ స్థానిక స్వయంభూ సిద్ధివినాయక గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. పేరుకు పూజారే అయినప్పటికీ అతడు చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలయ్యాడు. విష్ణుపురి ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్న గోర్తి వెంకట నారాయణ మూర్తి భార్య ఉమాదేవి రోజూ గుడికి వచ్చేది. దీంతో ఆమెతో కాస్త పరిచయం పెంచుకున్నాడు మురళీ కృష్ణ. కానీ అతని ఆలోచన అంతా ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగల మీదే ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై అతని కన్నుపడింది. వాటిని దొచుకునేందుకు అవకాశం కోసం వేచి చూశాడు మురళీకృష్ణ. అదే ఏడాది ఏప్రిల్ 18న రాత్రి 7.30కు ఆలయానికి వచ్చిన ఆమెను గర్భగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఉమాదేవిపై ఐరన్ రాడ్డుతో బలంగా కొట్టాడు. తలపై గట్టిగా మోది హత్య చేశాడు. ఉమాదేవి ఒంటిపై ఉన్న నగలను కాజే శాడు.
ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేయడానికి భారీ స్కెచ్ వేశాడు పూజారి మురళీ కృష్ణ. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి గర్భగుడిలో దాచి మూడు రోజుల పాటు గుడికి తాళాలు వేసి శుభ్రం చేశాడు. అప్పటికే మృతురాలి భర్త ఫిర్యా దుతో మల్కాజిగిరి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలించారు. మరోవైపు డెడ్ బాడీ కారణంగా.. గుడిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని పూజారి గుడి వెనుక గల చెట్ల పొదల్లో పారేశాడు. మృతురాలి చెప్పులు గుడి బయట లభించడం, పూజారి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నగల కోసమే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. మురళీకృష్ణపై నేరాభియోగ పత్రాన్ని సమర్పించారు. బాధితురాలి తరఫున అడిషనల్ పీపీ ఎస్.కోమలత వాదనలు వినిపించారు. కేసును విచారించిన మల్కాజిగిరి కోర్టు 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి.కిరణ్ కుమార్ మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.7,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
తాజావార్తలు
-
Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
-
Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
-
Dell 15 2026: ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 15.6-అంగుళాల డిస్ప్లేతో.. డెల్ 15 2026 ల్యాప్టాప్ విడుదల
-
Nitish Kumar Bihar Strategy: బీహార్ను విడిచేది లేదు.. సర్కార్పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్కుమార్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
-
Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!