Iran: భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా అధికారిని చంపినందుకు ఇద్దరు వ్యక్తులను ఉరితీసింది. యువతి కస్టడీలో మరణించడంతో నిరసనలు చెలరేగడంతో పారామిలటరీ దళ సభ్యుడిని చంపినందుకు దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులను ఇరాన్ శనివారం ఉరితీసిందని న్యాయవ్యవస్థ తెలిపింది. దేశవ్యాప్త నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు ఉరితీయబడిన సంఖ్య కంటే తాజా హత్యలు రెట్టింపు అయ్యాయి. డిసెంబర్లో ఈ ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించడం ప్రపంచ ఆగ్రహానికి కారణమైంది.
పారామిలటరీ దళ సభ్యుడైన రుహోల్లా అజామియన్ను హత్య చేసిన నేరంలో ప్రధాన నిందితులైన మహ్మద్ మహదీ కరామి, సయ్యద్ మొహమ్మద్ హొస్సేనీలను ఈ ఉదయం ఉరితీశారని వార్తా సంస్థ మిజాన్ ఆన్లైన్ నివేదించింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నవంబర్ 3న అజామియన్ను చంపినట్లు ఆరోపిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు మరణశిక్షలను సమర్థించింది.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
Russia-Ukraine War: మాట తప్పిన రష్యా.. కాల్పుల విరమణ ప్రకటనకు తూట్లు
హిజాబ్ను సరిగా ధరించలేదన్న కారణంతో మహస అమిని అనే 22 ఏళ్ల యువతిని నైతిక విలువల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో ఆ తర్వాత ఆమె మృతి చెందడం దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రదర్శనలకు సంబంధించి 14 మందికి కోర్టులు మరణశిక్ష విధించాయి. వారిలో నలుగురికి ఉరిశిక్ష విధించబడింది, మరో ఇద్దరికి సుప్రీంకోర్టు వారి శిక్షలను నిర్ధారించింది. ఆరుగురు కొత్త విచారణల కోసం వేచి ఉన్నారు. మరో ఇద్దరు అప్పీలు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?