Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Killer Targets Older Women: ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి. అతను వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని బారాబంకి పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ కొద్ది రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలను హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న హంతకుల కోసం ఆరు బృందాలు బారాబంకి పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని తొలగించి ఆయన స్థానంలో మరో అధికారిని ఎస్పీ నియమించారు. మొదటి సంఘటన 5 డిసెంబర్ 2022న అయోధ్య జిల్లాలో నమోదైంది. మావాయి ప్రాంతంలోని ఖుషేతి గ్రామానికి చెందిన 60 ఏళ్ల బాధితురాలు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెతకడం ప్రారంభించారు. అనంతరం డిసెంబర్ 6న ఏకాంత ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై బట్టలు కూడా లేవని పోలీసులు తెలిపారు. మహిళ ముఖం, తలపై గాయాల గుర్తులు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదికలో మహిళపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని వారు తెలిపారు.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద అగ్నిప్రమాదం.. తగులబడుతున్న బస్సు
రెండవ సంఘటనలో, బారాబంకి జిల్లాలోని పొలంలో 62 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కూడా అదే పద్ధతిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గుడ్డ లేదని, పోస్ట్మార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అదే విధంగా డిసెంబర్ 30న రామ్స్నేహిఘాట్ కొత్వాలికి 3 కి.మీ దూరంలోని తథార్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. హత్యల తీరు ఇలాగే ఉందని అధికారులు తెలిపారు. మరణించిన మహిళలందరూ 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. వీరంతా ఇదే విధంగా హత్యకు గురయ్యారు. ఇప్పటికే నిందితుడి ఫొటోను పోలీసులు ఇంటర్నెట్లో వైరల్ చేశారు. బారాబంకి, సమీప పోలీస్ స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. బారాబంకి పోలీసుల ఆరు బృందాలు ప్రస్తుతం హంతకుడి కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఇప్పటివరకు, హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!