Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Killer Targets Older Women: ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి. అతను వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని బారాబంకి పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ కొద్ది రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలను హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న హంతకుల కోసం ఆరు బృందాలు బారాబంకి పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని తొలగించి ఆయన స్థానంలో మరో అధికారిని ఎస్పీ నియమించారు. మొదటి సంఘటన 5 డిసెంబర్ 2022న అయోధ్య జిల్లాలో నమోదైంది. మావాయి ప్రాంతంలోని ఖుషేతి గ్రామానికి చెందిన 60 ఏళ్ల బాధితురాలు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెతకడం ప్రారంభించారు. అనంతరం డిసెంబర్ 6న ఏకాంత ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై బట్టలు కూడా లేవని పోలీసులు తెలిపారు. మహిళ ముఖం, తలపై గాయాల గుర్తులు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదికలో మహిళపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని వారు తెలిపారు.
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద అగ్నిప్రమాదం.. తగులబడుతున్న బస్సు
రెండవ సంఘటనలో, బారాబంకి జిల్లాలోని పొలంలో 62 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కూడా అదే పద్ధతిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గుడ్డ లేదని, పోస్ట్మార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అదే విధంగా డిసెంబర్ 30న రామ్స్నేహిఘాట్ కొత్వాలికి 3 కి.మీ దూరంలోని తథార్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. హత్యల తీరు ఇలాగే ఉందని అధికారులు తెలిపారు. మరణించిన మహిళలందరూ 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. వీరంతా ఇదే విధంగా హత్యకు గురయ్యారు. ఇప్పటికే నిందితుడి ఫొటోను పోలీసులు ఇంటర్నెట్లో వైరల్ చేశారు. బారాబంకి, సమీప పోలీస్ స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. బారాబంకి పోలీసుల ఆరు బృందాలు ప్రస్తుతం హంతకుడి కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఇప్పటివరకు, హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
-
PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!