Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు
Serial Killer Targets Older Women: ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి. అతను వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని బారాబంకి పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ కొద్ది రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలను హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న హంతకుల కోసం ఆరు బృందాలు బారాబంకి పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని తొలగించి ఆయన స్థానంలో మరో అధికారిని ఎస్పీ నియమించారు. మొదటి సంఘటన 5 డిసెంబర్ 2022న అయోధ్య జిల్లాలో నమోదైంది. మావాయి ప్రాంతంలోని ఖుషేతి గ్రామానికి చెందిన 60 ఏళ్ల బాధితురాలు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెతకడం ప్రారంభించారు. అనంతరం డిసెంబర్ 6న ఏకాంత ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై బట్టలు కూడా లేవని పోలీసులు తెలిపారు. మహిళ ముఖం, తలపై గాయాల గుర్తులు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదికలో మహిళపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని వారు తెలిపారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద అగ్నిప్రమాదం.. తగులబడుతున్న బస్సు
రెండవ సంఘటనలో, బారాబంకి జిల్లాలోని పొలంలో 62 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె కూడా అదే పద్ధతిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గుడ్డ లేదని, పోస్ట్మార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అదే విధంగా డిసెంబర్ 30న రామ్స్నేహిఘాట్ కొత్వాలికి 3 కి.మీ దూరంలోని తథార్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. హత్యల తీరు ఇలాగే ఉందని అధికారులు తెలిపారు. మరణించిన మహిళలందరూ 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. వీరంతా ఇదే విధంగా హత్యకు గురయ్యారు. ఇప్పటికే నిందితుడి ఫొటోను పోలీసులు ఇంటర్నెట్లో వైరల్ చేశారు. బారాబంకి, సమీప పోలీస్ స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. బారాబంకి పోలీసుల ఆరు బృందాలు ప్రస్తుతం హంతకుడి కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఇప్పటివరకు, హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో