ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు.
ఓ బర్రె తన యజమాని వివాదాన్ని పరిష్కరించింది. పంచాయితీ పెద్ద మనుషులు, స్థానిక పోలీసులు తేల్చలేకపోయిన పంచాయితీని బర్రె తేల్చింది. ఇది వింతగా అనిపించినప్పటికీ నిజంగానే జరిగింది. తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనదని ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు.
బీహార్లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ను కొందరు దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చెన్నై అదనపు కమిషనర్(నార్త్) అస్రా గార్గ్ వెల్లడించారు.
బ్రిటిష్ పార్లమెంటరీ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) ఘోర పరాజయంతో అధికారానికి దూరమైంది. కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు మాత్రమే సాధించింది, ఇది 2019లో గత ఎన్నికల కంటే 250 సీట్లు తక్కువ. పరాజయం తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
హత్రాస్ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు.
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు.
యూనివర్సల్ స్టార్ కమల్హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. రి
బ్రిటన్లో జూలై 4న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో లేబర్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పెద్దలు ఓడిపోయారు. నివేదికల ప్రకారం, కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు, బ్రిటీష్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కూడా సౌత్ వెస్ట్ నార్ఫోక్ స్థానం నుంచి ఈ ఎన్నికలలో ఓడిపోయారు.
భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్పీఎల్) 35 వేల ఏకే-203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లను భారత సైన్యానికి అందజేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కింద తయారైన ఈ రైఫిల్స్ సైన్యాన్ని బలోపేతం చేస్తాయి. భారతదేశం సమీకరించిన కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ను ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేశారు.