Tripura HIV Cases: విద్యార్థులకు హెచ్ఐవీ.. 47 మంది మృతి
- త్రిపురలో హెచ్ఐవీ కలకలం
- త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి
- ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura HIV Cases: త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత చదువుల కోసం చాలా మంది విద్యార్థులు త్రిపుర నుంచి వెళ్లిపోయారు. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్న విద్యార్థులను గుర్తించింది. ఇదొక్కటే కాదు, ప్రతిరోజూ దాదాపు 5 నుంచి ఏడు కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయని టీఎస్ఏసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also: ఆషాడమాసంలో నూతన వధూవరులు కలిసి ఉండొద్దు.. కారణమిదే..?
Also Read
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
త్రిపుర జర్నలిస్ట్స్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్షాప్లో ప్రసంగిస్తూ, టీఎస్ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ త్రిపురలో హెచ్ఐవీ వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మేము రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుండి డేటాను సేకరించామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్యపై త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి మాట్లాడుతూ.. 2024 మే నాటికి యాంటీరెట్రోవైరల్ థెరపీ కేంద్రాలలో 8,729 మందిని గుర్తించామన్నారు. మొత్తం హెచ్ఐవీతో బాధపడుతున్న వారి సంఖ్య 5,674గా గుర్తించారు. వీరిలో 4,570 మంది పురుషులు కాగా, 1,103 మంది మహిళలు ఉన్నారు. ఈ రోగులలో ఒకరు మాత్రమే ట్రాన్స్జెండర్.
హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని వారు వెల్లడించారు. చాలా సందర్భాలలో సంపన్న కుటుంబాల పిల్లలు హెచ్ఐవీ బారిన పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని గ్రహించే సమయానికి చాలా ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!