Tripura HIV Cases: విద్యార్థులకు హెచ్ఐవీ.. 47 మంది మృతి
- త్రిపురలో హెచ్ఐవీ కలకలం
- త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి
- ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura HIV Cases: త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత చదువుల కోసం చాలా మంది విద్యార్థులు త్రిపుర నుంచి వెళ్లిపోయారు. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్న విద్యార్థులను గుర్తించింది. ఇదొక్కటే కాదు, ప్రతిరోజూ దాదాపు 5 నుంచి ఏడు కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయని టీఎస్ఏసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also: ఆషాడమాసంలో నూతన వధూవరులు కలిసి ఉండొద్దు.. కారణమిదే..?
Also Read
త్రిపుర జర్నలిస్ట్స్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్షాప్లో ప్రసంగిస్తూ, టీఎస్ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ త్రిపురలో హెచ్ఐవీ వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మేము రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుండి డేటాను సేకరించామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్యపై త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి మాట్లాడుతూ.. 2024 మే నాటికి యాంటీరెట్రోవైరల్ థెరపీ కేంద్రాలలో 8,729 మందిని గుర్తించామన్నారు. మొత్తం హెచ్ఐవీతో బాధపడుతున్న వారి సంఖ్య 5,674గా గుర్తించారు. వీరిలో 4,570 మంది పురుషులు కాగా, 1,103 మంది మహిళలు ఉన్నారు. ఈ రోగులలో ఒకరు మాత్రమే ట్రాన్స్జెండర్.
హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని వారు వెల్లడించారు. చాలా సందర్భాలలో సంపన్న కుటుంబాల పిల్లలు హెచ్ఐవీ బారిన పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని గ్రహించే సమయానికి చాలా ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!