Tripura HIV Cases: విద్యార్థులకు హెచ్ఐవీ.. 47 మంది మృతి
- త్రిపురలో హెచ్ఐవీ కలకలం
- త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి
- ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura HIV Cases: త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది హెచ్ఐవీ పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత చదువుల కోసం చాలా మంది విద్యార్థులు త్రిపుర నుంచి వెళ్లిపోయారు. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్న విద్యార్థులను గుర్తించింది. ఇదొక్కటే కాదు, ప్రతిరోజూ దాదాపు 5 నుంచి ఏడు కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయని టీఎస్ఏసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also: ఆషాడమాసంలో నూతన వధూవరులు కలిసి ఉండొద్దు.. కారణమిదే..?
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
త్రిపుర జర్నలిస్ట్స్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్షాప్లో ప్రసంగిస్తూ, టీఎస్ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ త్రిపురలో హెచ్ఐవీ వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మేము రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుండి డేటాను సేకరించామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్యపై త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి మాట్లాడుతూ.. 2024 మే నాటికి యాంటీరెట్రోవైరల్ థెరపీ కేంద్రాలలో 8,729 మందిని గుర్తించామన్నారు. మొత్తం హెచ్ఐవీతో బాధపడుతున్న వారి సంఖ్య 5,674గా గుర్తించారు. వీరిలో 4,570 మంది పురుషులు కాగా, 1,103 మంది మహిళలు ఉన్నారు. ఈ రోగులలో ఒకరు మాత్రమే ట్రాన్స్జెండర్.
హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని వారు వెల్లడించారు. చాలా సందర్భాలలో సంపన్న కుటుంబాల పిల్లలు హెచ్ఐవీ బారిన పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని గ్రహించే సమయానికి చాలా ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!