Bhole Baba: చాలా బాధపడ్డాను, దోషులను విడిచిపెట్టబోం.. మీడియా ముందు భోలే బాబా ప్రత్యక్షం
- మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా
- జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని విచారం వ్యక్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhole Baba: హత్రాస్ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు. దోషులను విడిచిపెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఈ దుఃఖాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు మాకు ప్రసాదించుగాక అని భోలే బాబా అన్నారు.
“ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పరిపాలనను నమ్మండి. అరాచకాలను వ్యాపింపజేసిన వారెవరినీ విడిచిపెట్టరని నాకు నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని, జీవితాంతం వారికి సహాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాను.” అని భోలే బాబా పేర్కొన్నారు.
Also Read
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
Read Also: Tripura HIV Cases: విద్యార్థులకు హెచ్ఐవీ.. 47 మంది మృతి
ప్రధాన నిందితుడు అరెస్ట్
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఢిల్లీలోని నజాఫ్గఢ్లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. యూపీ ఎస్టీఎఫ్ బృందం అతడిని ఆస్పత్రి నుంచే అదుపులోకి తీసుకుంది. ఈ విషయమై భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎస్టీఎఫ్, సిట్ బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అతని స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మధుకర్ హార్ట్ పేషెంట్ కావడంపై లాయర్ ప్రస్తావిస్తూ.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ, బాబా తన సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో సంఘ వ్యతిరేకుల పాత్ర ఉందని పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంపై కూడా మాట్లాడారు.
హత్రాస్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ సమాచారాన్ని స్వయంగా సిట్లో చేర్చిన ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనుపమ్ కులశ్రేష్ఠ శుక్రవారం తెలిపారు.
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!