Bhole Baba: చాలా బాధపడ్డాను, దోషులను విడిచిపెట్టబోం.. మీడియా ముందు భోలే బాబా ప్రత్యక్షం
- మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా
- జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని విచారం వ్యక్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhole Baba: హత్రాస్ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు. దోషులను విడిచిపెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఈ దుఃఖాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు మాకు ప్రసాదించుగాక అని భోలే బాబా అన్నారు.
“ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పరిపాలనను నమ్మండి. అరాచకాలను వ్యాపింపజేసిన వారెవరినీ విడిచిపెట్టరని నాకు నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని, జీవితాంతం వారికి సహాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాను.” అని భోలే బాబా పేర్కొన్నారు.
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
Read Also: Tripura HIV Cases: విద్యార్థులకు హెచ్ఐవీ.. 47 మంది మృతి
ప్రధాన నిందితుడు అరెస్ట్
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఢిల్లీలోని నజాఫ్గఢ్లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. యూపీ ఎస్టీఎఫ్ బృందం అతడిని ఆస్పత్రి నుంచే అదుపులోకి తీసుకుంది. ఈ విషయమై భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎస్టీఎఫ్, సిట్ బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అతని స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మధుకర్ హార్ట్ పేషెంట్ కావడంపై లాయర్ ప్రస్తావిస్తూ.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ, బాబా తన సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో సంఘ వ్యతిరేకుల పాత్ర ఉందని పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంపై కూడా మాట్లాడారు.
హత్రాస్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ సమాచారాన్ని స్వయంగా సిట్లో చేర్చిన ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనుపమ్ కులశ్రేష్ఠ శుక్రవారం తెలిపారు.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!