Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Whats Today As On 12th July 2024 -
Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. -
Anam Ramanarayana Reddy: చంద్రబాబు సూచనతో దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం..!
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. -
Yanamala: ప్రాజెక్టులు పూర్తి చేయక.. ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు..
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు. -
Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..
Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. -
Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి పర్మిషన్ తెచ్చింది నేనే
Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నేనే సెన్షన్.. ఆర్డర్ తెచ్చానని రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. నా తరువాత వచ్చిన మాజీ ఎంపి మార్గా భరత్ రామ్ శిలాఫలకం వేసి నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. -
MP Purandeswari: దేశాన్ని నరేంద్ర మోడీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు..
MP Purandeswari: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. -
Minister Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు..
Minister Lokesh: పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై మంత్రి సీరియస్ అయ్యారు. -
Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..
Kurnool: కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. వాసంతి అనే బాలిక 7వ తేదీ నుంచి అదృశ్యం అయింది. అన్ని ప్రాంతాల్లో వెతికినా దొరకని బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
YV Subba Reddy: జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు..
YV Subba Reddy: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వాస్తవం కాదు..విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!