TTD Big Alert: తిరుమల వెళ్లే భక్తులకు షాక్.. రాత్రి 9 తర్వాత ఆ రూట్లు బంద్!
- అలిపిరి నడక మార్గంలో కొనసాగుతున్న ఆంక్షలు..
- ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి..
- చిన్నారులకు మధ్యాహ్నం 12గంటల వరకే అలిపిరి నడక మార్గం గుండా అనుమతి..
- మధ్యాహ్నం 2గంటల నుంచి అలిపిరి నుంచి భక్తులు గుంపులుగా వెళ్లాలి: టీటీడీ
TTD Big Alert: తిరుమల కొండకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గుంపులు గుంపులుగా వదిలి పెడుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది చూస్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించమని తేల్చి చెప్పారు. రాత్రి 9 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: UP: పెళ్లికి వెళ్లే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ.. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
అయితే, తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. తిరుమలలో చిరుతల సంచారం నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో ఈ ఆంక్షలు పెట్టారు. ఆ మార్గంలో విజిలెన్స్ అధికారులు గస్తీని మరింత ముమ్మరం చేశారు. కాగా, గురువారం నాడు రాత్రి అలిపిరి నడక మార్గంలోని 7వ మలుపు సమీపంలోని ముగ్గుబావి దగ్గర చిరుత కదలికలను భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత తిరుగుతుండటంతో భక్తులు భయపడుతుండటంతో.. టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!