TTD Big Alert: తిరుమల వెళ్లే భక్తులకు షాక్.. రాత్రి 9 తర్వాత ఆ రూట్లు బంద్!
- అలిపిరి నడక మార్గంలో కొనసాగుతున్న ఆంక్షలు..
- ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి..
- చిన్నారులకు మధ్యాహ్నం 12గంటల వరకే అలిపిరి నడక మార్గం గుండా అనుమతి..
- మధ్యాహ్నం 2గంటల నుంచి అలిపిరి నుంచి భక్తులు గుంపులుగా వెళ్లాలి: టీటీడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Big Alert: తిరుమల కొండకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గుంపులు గుంపులుగా వదిలి పెడుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది చూస్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించమని తేల్చి చెప్పారు. రాత్రి 9 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: UP: పెళ్లికి వెళ్లే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ.. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య
Also Read
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
అయితే, తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. తిరుమలలో చిరుతల సంచారం నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో ఈ ఆంక్షలు పెట్టారు. ఆ మార్గంలో విజిలెన్స్ అధికారులు గస్తీని మరింత ముమ్మరం చేశారు. కాగా, గురువారం నాడు రాత్రి అలిపిరి నడక మార్గంలోని 7వ మలుపు సమీపంలోని ముగ్గుబావి దగ్గర చిరుత కదలికలను భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత తిరుగుతుండటంతో భక్తులు భయపడుతుండటంతో.. టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!