UP: పెళ్లికి వెళ్లే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ.. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య
- పెళ్లికి వెళ్లే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ
- ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆలుమగలు అన్నాక చిన్న చిన్న గొడవలు.. కోపాలు.. తాపాలు ఉండడం సహజమే. కొద్దిసేపటి తర్వాత మరిచిపోయి మళ్లీ కలిసి పోతుంటారు. ఇలా దంపతుల మధ్య జరుగుతూనే ఉంటాయి. యూపీలో ఓ జంట మాత్రం పెళ్లికి వెళ్లే విషయంలో తగాదా పడి.. ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Rukshar Dhillon : గుబులు పుట్టిస్తున్న రుక్సర్ థిల్లాన్ స్టన్నింగ్ ఫోజులు..
Also Read
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా కాకరాల గ్రామానికి చెందిన రోహిత్ (26), పార్వతి (24) భార్యాభర్తలు. గురువారం సాయంత్రం బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండడంతో భర్తను సిద్ధం కావాలని భార్య కోరింది. అయితే భార్య మాట లెక్క చేయకుండా బయటకు వెళ్లి ఫుల్గా మద్యం తాగి వచ్చాడు. దీంతో భర్త తీరుతో మనస్తాపం చెందిన పార్వతి.. ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక భార్య చనిపోయిందన్న వార్త తెలుసుకున్న రోహిత్.. మీర్జాపూర్ బేలా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025 : మహా కుంభమేళాలో ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు.. సరికొత్త రికార్డు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. భర్త నిర్లక్ష్యంతో భార్య ఆత్మహత్య చేసుకుందని.. భార్య చనిపోయిందన్న వార్త తెలిసి భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడని శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!