TTD Srivani Tickets: తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆఫ్ లైన్ విధానంలో టిక్కెట్ల జారీకి మంగళం పాడే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టిక్కెట్లను అధికారులు జారీ చేస్తున్నారు.
Huge Rush In Tirumala: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా గత రెండు రోజుల్లోనే భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
CM Chandrababu: అమరావతి రాజధాని వెంకటాపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చాడు.. శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తుని గానే ఉంటాను అన్నారు.
Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.
Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్టు TTD అధికారులు తెలిపారు. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ…
Shiva Jyothi : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్ ఎదురు కావడంతో… శివజ్యోతి ఇప్పుడు క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల తిరుపతి ప్రసాదం, స్వామి దర్శనానికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్రమైన…
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు.
TTD Policy Change: అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకులు అందుతుండగా.. టన్ను వరకు బంగారం, పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్థులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ర్టాలలో 80 వేల కోట్ల రూపాయల ఆస్థులు ఉన్నాయి. మరో వైపు హిందు ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి 11 ట్రస్ట్ లు నిర్వహిస్తోంది.…