Dharmana Prasad Rao: రాజధానిగా ఉండే అర్హత విశాఖకు మాత్రమే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్కరణలు చేసే వాళ్లపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అందుకే ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధర్మాన తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని.. అందుకే ప్రజల ఆమోదం ఉండదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటే దానికి కారణం సంస్కరణలను అర్ధం చేసుకోలేకపోవడమే అని ధర్మాన అభిప్రాయపడ్డారు.
సంస్కరణలను చేయని వారిని నిందించాల్సింది పోయి సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేక పెద్ద ప్రాజెక్టులను తెచ్చామని.. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, మూల పేటలో పోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేస్తామన్నారు. 75 ఏళ్ల రాష్ట్ర సంపద, సంస్థలను హైదరాబాద్లో పెట్టామని.. అందుకే వారికి ఆశ కలిగిందన్నారు. అమరావతికి డబ్బులు పెట్టాక వారు పోమ్మంటే ఉత్తరాంధ్ర ఏం చేయాలని ధర్మాన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమం కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఇదే విషయం పార్టీకి చెప్పానని తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
Read Also: Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణం సమయంలో ఆహార పదార్ధాలపై దర్భను ఎందుకు పెట్టాలి?
రాష్ట్రానికి విశాఖ సెంట్రల్ పాయింట్లో లేదని జడ్జిలు మాట్లాడుతున్నారని.. చెన్నై, ముంబై, కోల్కతా వంటి రాజధానులు ఆయా రాష్ట్రాల సెంట్రల్లో ఉన్నాయా అని మంత్రి ధర్మాన నిలదీశారు. క్యాపిటల్ వస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుందని.. పలువురికి ఉపాధి లభిస్తుందని ధర్మాన అన్నారు. కేవలం విశాఖకు మాత్రమే రాజధానిగా అన్ని విధాలుగా అర్హత ఉందన్నారు. అందరినీ ఆదరించే గుణం, సంస్కారం విశాఖ వాసులకు ఉందన్నారు. మూడు రాజధానులు అంటూ పలువురు హేళన చేస్తున్నారని.. విశాఖ మెయిన్ రాజధానిగా ఉంటుందని.. హైకోర్టు పనులు కోసం కర్నూలుకు, అసెంబ్లీ సమావేశాల సమయంలో అమరావతికి ప్రజలు వెళ్తారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!