CM Chandrababu: రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. కలెక్టర్లకు దిశానిర్దేశం.
- రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష..
- జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu:రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.. తిరుపతి ఎర్రచందనం డిపో సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలి.. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపో వద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనం అనేది ఓ అరుదైన జాతి వృక్షంగా పేర్కొన్నారు.. ఇక, మోటారు వాహనాల పన్నులపై కలెక్టర్లు దృష్టి సారించాలి.. మున్సిపల్ విభాగం శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించేలా ప్రక్రియ చేపట్టాలి.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలి.. కొత్త లేఔట్లలో డ్రైన్లకు స్థలం కేటాయించేలా అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు..
Read Also: Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక, స్వర్ణ పంచాయత్ పోర్టల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.. గ్రామకంఠంలోని ఆస్తులకు కోటికి పైగా యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు.. 60 శాతం ఫిర్యాదులు రెవెన్యూ శాఖ లోనే వస్తున్నాయన్న ఆయన.. కులధృవీకరణ, భూములు ఇలా వేర్వేరు అంశాలు ఉన్నాయి.. 22 ఏలో భూములు పెట్టేయటం లాంటి చర్యల వల్ల దుష్పలితాలు వచ్చాయన్నారు.. గత ప్రభుత్వ హయాంలో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి ఇష్టానుసారం వ్యవహరించారు.. ఇప్పుడా చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల రక్షణకు వీలుగా చట్టాన్ని తెచ్చాం.. భూముల్ని కాజేయడానికి 22ఏలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డులను సరిచేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు..
Read Also: Indiramma Housing Scheme: ఇందిరమ్మ లిస్ట్లో పేర్లు తొలగించారని నిరసన.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళల!
కులం ఎవరిదీ మారిపోదు దానిని శాశ్వతప్రాతిపదికన ఇవ్వాలి.. నివాస, వయో ధృవీకరణ కోసం ప్రతీ ఏటా జారీ చేయొచ్చు.. అభ్యంతరం లేని భూములన్నీ రెగ్యులర్ చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కృతం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి అని సలహా ఇచ్చిన ఆయన.. రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పని చేయాలి.. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం.. వీఎంలు, కేఎంలు మార్చాం కానీ రెవెన్యూ విలేజిలను మార్చలేకపోతున్నాం అన్నారు.. ఇక, అక్టోబరు 22 వరకూ నెల రోజుల పాటు జీఎస్టీ ప్రయోజనాలు వివరించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!