Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Political Crisis: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో రాజకీయ గందరగోళం నెలకొంది. మంగళవారం ఒక్కరోజులో 12 మంది మంత్రులలో ఎనిమిది మంది అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు. ప్రస్తుతం మేఘాలయలో ఎన్పిపి నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే రాజీనామా చేసిన మంత్రులు సీఎం కాన్రాడ్ కె సంగ్మా సమక్షంలో వారి రాజీనామాలను గవర్నర్కు సమర్పించారు. ఇంతకీ ఈ రాజీనామాలకు కారణం ఏంటి..
READ ALSO: Vijayawada Utsav: ‘విజయవాడ ఉత్సవ్’కు హైకోర్టు షాక్..!
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
మంత్రివర్గంలోకి కొత్తవారికి ఛాన్స్..
ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన మంత్రివర్గంలో కొంతమంది కొత్త నాయకులను చేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుత మంత్రులను రాజీనామా చేయమని కోరినట్లు సమాచారం. రాజీనామా చేసిన ఎనిమిది మంది మంత్రులలో NPPకి చెందిన అంపారీన్ లింగ్డో, కమెగోన్ యంబోన్, రక్కం ఎ సంగ్మా, అబు తాహిర్ మండల్, UDPకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, HSPDPకి చెందిన షక్లియార్ వార్జ్రీ, BJPకి చెందిన AL హెక్ ఉన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారంలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 12 మందికిపైగా మంత్రులు ఉండకూడదు. తాజాగా రాజీనామా చేసిన వారు ఆయా పార్టీల సంస్థాగత పనుల్లో నిమగ్నం కానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా రానున్న సభ్యులతో మంగళవారం సాయంత్రం రాజ్ భవన్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక అధికారి తెలిపారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణాలు..
మేఘాలయలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వెనుక అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరచడానికి, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని సమాచారం. అలాగే కొత్త ముఖాలను చేర్చడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలో భాగంగా దీనిని చెబుతున్నారు.
READ ALSO: London Protests 2025: లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా! అసలు బ్రిటన్లో ఏం జరుగుతుంది..
తాజావార్తలు
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!