Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Political Crisis: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో రాజకీయ గందరగోళం నెలకొంది. మంగళవారం ఒక్కరోజులో 12 మంది మంత్రులలో ఎనిమిది మంది అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు. ప్రస్తుతం మేఘాలయలో ఎన్పిపి నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే రాజీనామా చేసిన మంత్రులు సీఎం కాన్రాడ్ కె సంగ్మా సమక్షంలో వారి రాజీనామాలను గవర్నర్కు సమర్పించారు. ఇంతకీ ఈ రాజీనామాలకు కారణం ఏంటి..
READ ALSO: Vijayawada Utsav: ‘విజయవాడ ఉత్సవ్’కు హైకోర్టు షాక్..!
Also Read
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి 'కాకరకాయ ఉల్లి కారం'.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
- Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
- Jana Nayagan: విజయ్ 'లియో', రజనీ 'కూలీ' రికార్డులను దాటలేకపోయిన 'జన నాయగన్'.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
మంత్రివర్గంలోకి కొత్తవారికి ఛాన్స్..
ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన మంత్రివర్గంలో కొంతమంది కొత్త నాయకులను చేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుత మంత్రులను రాజీనామా చేయమని కోరినట్లు సమాచారం. రాజీనామా చేసిన ఎనిమిది మంది మంత్రులలో NPPకి చెందిన అంపారీన్ లింగ్డో, కమెగోన్ యంబోన్, రక్కం ఎ సంగ్మా, అబు తాహిర్ మండల్, UDPకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, HSPDPకి చెందిన షక్లియార్ వార్జ్రీ, BJPకి చెందిన AL హెక్ ఉన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారంలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 12 మందికిపైగా మంత్రులు ఉండకూడదు. తాజాగా రాజీనామా చేసిన వారు ఆయా పార్టీల సంస్థాగత పనుల్లో నిమగ్నం కానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా రానున్న సభ్యులతో మంగళవారం సాయంత్రం రాజ్ భవన్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక అధికారి తెలిపారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణాలు..
మేఘాలయలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వెనుక అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరచడానికి, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని సమాచారం. అలాగే కొత్త ముఖాలను చేర్చడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలో భాగంగా దీనిని చెబుతున్నారు.
READ ALSO: London Protests 2025: లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా! అసలు బ్రిటన్లో ఏం జరుగుతుంది..
తాజావార్తలు
-
Shreyas Iyer: 7 మ్యాచ్ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి!
-
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
-
Shambo Shiva Shambo Re Release: ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్గా 4Kలో ‘శంభో శివ శంభో’.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?