CM Chandrababu: బనకచర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ప్రాజెక్టులన్నీ కట్టుకోండి..!
- బనకచర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా?..
- తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు?..
- కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి..
- మిగిలిన నీటినే మేం వాడుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ మొదలైంది.. ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజం పడింది.. ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.. కానీ, తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేం రాజీ పడం అంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. తాజాగా బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..
Read Also: Tamil Nadu: ‘‘మురుగన్ సదస్సు’’కు వెళ్లనున్న సీఎం యోగి, పవన్ కళ్యాణ్.. ప్రశ్నించిన డీఎంకే..
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాక.. వైఎస్ రాజశేఖర్రెడ్డి కంటిన్యూ చేసాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా నీటిపారుదల ప్రాజెక్ట్ లు నేనే మొదలు పెట్టా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా నేను అభ్యంతరం చెప్పలేదు అన్నారు చంద్రబాబు.. సముద్రంలోకి వెళ్లే నీటితో ప్రాజెక్ట్ పై సమస్య ఏంటి? అని ప్రశ్నించారు.. వాదన.. ఏదైనా చెయ్యచ్చు… కానీ, కొట్లాట వల్ల ఉపయోగం లేదు అన్నారు.. గొడవ పడితే ప్రజల్ని మభ్య పెట్టినట్టు.. నేను గొడవ పడితే ప్రయోజనం లేదు అన్నారు.. హైదరాబాద్ వల్ల ఆదాయం వస్తోంది.. నాకు సంతోషం.. హైదరాబాద్.. అమరావతి నా ఉద్యోగం కోసం కట్టానా? అని ప్రశ్నించారు.. బనకచర్ల ప్రాజెక్టు పై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరం అయితే ఢిల్లీలో కూర్చుని మాట్లాడతా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: UP: నేరస్థుల ఏరివేతలో యోగి సర్కార్ రూటే వేరు.. 8 ఏళ్లలో 14,741 ఎన్కౌంటర్లు..
కాగా, బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు ఓ సూచన చేస్తున్నా.. మీరు పక్క రాష్ట్ర సీఎం.. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు.. మీరేం చెబితే ప్రధాని నరేంద్ర మోడీ అది వినొచ్చు.. అంతమాత్రాన.. బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అలాంటి అవకాశం లేదు.. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద స్పష్టంగా ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..