Home
Godavari River
Godavari River News
-
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు… -
Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి. దీంతో కోయిదా, దాచారం, పేరంటాలపల్లి సహా పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద వల్ల రెండు మండలాల్లోని 28 గ్రామాలు,… -
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో నదీ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోతుండటంతో గోదావరి గట్టు ప్రమాదంలో పడింది. దీంతో చుట్టుపక్కల నివసించే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించి, మరింత నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. నదీ తీరంలో… -
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాలు, ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీని ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై తీవ్రంగా పడింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే… నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన భారీ… -
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
DK Shivakumar: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల సంక్షేమమే తమ… -
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి ఓ కానిస్టేబుల్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్.. ప్రేమ వైఫల్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బ్రిడ్జిపై తన బైక్ను వదిలి గోదావరిలోకి దూకినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్… -
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయలుదేరే బోట్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. పాపికొండల యాత్ర కోసం ముందుగానే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులకు పర్యాటక శాఖ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బోటు సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో… -
Sabari – Godavari Floods: శబరి – గోదావరి నదుల ఉధృతి.. 100 గ్రామాలకు రాకపోకలు బంద్..!
Sabari – Godavari Floods: మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి – గోదావరి నదులు.. దీంతో, కూనవరం వద్ద 47.75 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం.. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్ లో ఇళ్లలోకి వరద… -
Cinema Chettu: 300 సినిమాల చరిత్రకు మళ్లీ ఊపిరి..! గోదావరి గట్టున సినిమా చెట్టుకు పునరుజ్జీవం..
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ వృక్షం, గతంలో 300కి పైగా చిత్రాలలో కనిపించి దర్శకులు, నటులను ఆకట్టుకుంది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహా వృక్షం రెండుగా చీలి నేలవాలిపోయింది. దీంతో చెట్టును సినిమాలలో చూసిన వారు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని పలువురు విజ్ఞప్తులు… -
Bhadrachalam: భద్రాచలంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ!
Bhadrachalam: గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!