2021ని విజయంతో ప్రారంభించి.. విజయంతోనే ముగించిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్ట్ ఫార్మాట్కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ పరాజయం చవిచూసింది.
Read Also: బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
Also Read
అనంతరం ఇంగ్లండ్ గడ్డపైనే జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా మెరుగ్గా ఆడింది. నాలుగు టెస్టులు జరగ్గా రెండు మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఒక టెస్టులో పరాజయం పాలవగా… మరొక టెస్టును డ్రాగా ముగించింది. కరోనా కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టు 2022లో జరిగే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్లో న్యూజిలాండ్ జట్టు టీమిండియా పర్యటనకు వచ్చి రెండు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రాగా ముగియగా… రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. తాజాగా డిసెంబర్ నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా సెంచూరియన్ టెస్టులో ఘనవిజయం సాధించింది. అలా టెస్టుల్లో ఈ ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించి విజయంతోనే ముగించింది.
తాజావార్తలు
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
-
Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!