Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..
- అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
- పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసు- మంత్రి
- ఈ వ్యవహారం కోర్టులో ఉంది- శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీఎం.. మానవీయ కోణం మర్చిపోయారు అని బాధతో చెప్పారు.. చనిపోయిన సోదరి కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండే అనేది తమ ఆలోచన అని అన్నారు. అలాగే.. చిన్న అబ్బాయిని బతికించాలి అనేది తమ తాపత్రయం అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ల గురించి మాట్లాడారు సీఎం.. ఇండస్ట్రీ పెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కదా అనేది ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రోడ్ షో చేశారా లేదా అనేది వీడియోలు చూస్తే తెలుస్తుంది కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Revanth Reddy: అన్ని మతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
హీరో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమైన యాక్సిడెంట్ అని అన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే.. ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదన్నారు. యాక్సిడెంట్ జరిగినందుకు నేను ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి గంట గంటకు వివరాలు తెలుసుకుంటున్నానని తెలిపారు. మరోవైపు.. తాను బాధ్యత లేకుండా థియేటర్కి వెళ్లాను.. పర్మిషన్ లేకుండా వెళ్లానని అంటున్నారు.. అది ఖచ్చితంగా తప్పుడు సమాచారం అని అన్నారు. థియేటర్ వాళ్లు పర్మిషన్ విషయంలో క్లారిటీ తెచ్చుకున్నారని తెలియడంతోనే అక్కడికి వెళ్లానని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులే దారి క్లియర్ చేస్తున్నారు.. పోలీసుల డైరెక్షన్లోనే తాను వెళుతున్నాను అంతా క్లియర్ అయిపోయింది అని అనుకున్నానని తెలిపారు.
Maharashtra: మంత్రులకు శాఖలు కేటాయింపు.. షిండేకు మళ్లీ నిరాశ
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం తన వ్యక్తిత్వ హననం అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అని అంటూనే తన గురించి చాలా తప్పుడు ప్రచారం, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు.. కాబట్టి తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని, ఏ డిపార్ట్మెంట్ ని బ్లేమ్ చేయడం లేదని తెలిపారు. అలాగే తాను ఏ పొలిటికల్ లీడర్ ని.. అలాగే గవర్నమెంట్ ని కూడా బ్లేమ్ చేయడం లేదని పేర్కొన్నారు. నిజానికి గవర్నమెంట్ తమతో చాలా బాగుందని ఎందుకంటే తమకు థియేటర్లకు మంచి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వంతో తమకు అంతా బానే ఉందని చెప్పుకొచ్చారు. తాను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేను ఇలా బిహేవ్ చేశాను అంటూ ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జు్న్ అన్నారు.
తాజావార్తలు
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!