Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- యువత కంటే ఎవరూ గొప్పవారు కాదు
- ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’!
- కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ యువతకు వ్యవస్థ పదేపదే అన్యాయం చేస్తోందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యువతే దేశానికి అసలైన శక్తి, గర్వకారణమని అన్నారు. ‘‘దేశ యువత కంటే ఎవరూ గొప్పవారు కాదు.. మీరే భారతదేశ శక్తి, గర్వం. నేను ఇలా చెబుతున్నప్పుడు ప్రతి భారతీయ పౌరుడి గురించి మాట్లాడుతున్నాను’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
భారత యువతలో అపారమైన ప్రతిభ ఉందని అన్నారు. చైనా, రష్యా దేశాల యువతతో పోలిస్తే భారత యువత ఎంతో ప్రతిభావంతులని పేర్కొన్నారు. అయితే తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు భారత యువతకు సమాన అవకాశాలు లభించడం లేదని ఆరోపించారు. ‘‘ఈ సాయంత్రం నేను మూడు అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అవి బాధ, డేటా, సంపద’’ అని అన్నారు. దేశంలోని సుమారు 40 కోట్ల మంది యువతే భారతదేశానికి అతిపెద్ద బలమని పేర్కొన్నారు. అమెరికా, చైనా, రష్యా గురించి తరచూ చర్చ జరుగుతుంటుందని.. కానీ భారత యువతకు సాటిలేరని అన్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
దేశంలోని విద్యా వ్యవస్థపై కూడా రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్లో డిగ్రీ సర్టిఫికెట్కు పెద్దగా విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. డిగ్రీ పొందిన తర్వాత కూడా ఉద్యోగం లభించకపోవడంతో విద్యార్హతలు నిరర్థకంగా మారుతున్నాయని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అనంతరం కేపీ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత తన పూర్వీకుల నివాసమైన ఆనంద్ భవన్-స్వరాజ్ భవన్కు వెళ్లారు. ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు. అలహాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ ఉజ్వల్ రమణ్ సింగ్తో పాటు పలువురు పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ బాధ్యులు, కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీ కార్యక్రమానికి ముందు ప్రయాగ్రాజ్లో ఆయనకు మద్దతుగా పలు పోస్టర్లు, హోర్డింగ్లు కనిపించాయి. ‘‘మాకు ఉద్యోగాలు కావాలి.. పెల్లెట్ గన్స్ కాదు’’, ‘‘మంత్రి గారి పెద్ద కారు.. దేశ యువత నిరుద్యోగం’’ వంటి నినాదాలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. మరో హోర్డింగ్లో రాహుల్ గాంధీ చిత్రంతో పాటు ‘‘ఉద్యోగం రాకపోతే సింహాసనం కదులుతుంది’’ అనే నినాదాన్ని ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే ‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించిందని, కొన్ని షరతులతో కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!