Maharashtra: మంత్రులకు శాఖలు కేటాయింపు.. షిండేకు మళ్లీ నిరాశ
- మంత్రులకు శాఖలు కేటాయింపు
- షిండేకు మళ్లీ నిరాశ
- దూరమైన హోంశాఖ పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవిస్.. మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఏక్నాథ్ షిండేకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన ఆశించిన హోంశాఖ దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా రోజులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో హోంశాఖ అయినా దొరుకుతుందని ఆశ పడ్డారు. తీరా ఆ శాఖ కూడా దక్కకుండా పోయింది. షిండేకు మూడు పోర్ట్ఫోలియోలు దక్కాయి. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, ప్రజా పనుల ఫోలియోలు దక్కాయి.
ఫడ్నవిస్ దగ్గర హోంశాఖ, లా, న్యాయశాఖలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫైనాన్స్, ప్లానింగ్, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. మొత్తానికి 4 వారాల చర్చల తర్వాత ఈ ఫోర్ట్పోలియో జరగడం విశేషం.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
చంద్రకాంత్ పాటిల్కు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖను కేటాయించగా.. గణేష్ నాయక్కు అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యకు సంబంధించిన కీలక బాధ్యత దాదా భూసేకి అప్పగించారు. రెవెన్యూ మంత్రిగా బవాన్కులే, జలవనరుల శాఖకు రాధాకృష్ణ విఖే పాటిల్ నేతృత్వం వహిస్తారు. హసన్ ముష్రిఫ్ వైద్య విద్యను పర్యవేక్షించనున్నారు. అదితి తత్కరేకు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు జయకుమార్ గోరే, సామాజిక న్యాయం కోసం సంజయ్ శిర్సత్కు కేటాయించారు. ధనంజయ్ ముండేకు ఆహార మరియు పౌర సరఫరాల శాఖను అప్పగించారు. అశోక్ ఉయికే గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించనన్నారు. ఆశిష్ షెలార్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కల్చర్ శాఖలు ఇవ్వబడ్డాయి. ఉదయ్ సమంత్కు పరిశ్రమల శాఖను కేటాయించారు. పంకజా ముండేకు పర్యావరణ మంత్రిత్వ శాఖను ఇవ్వగా.. మాణిక్రావు కొకాటేకు కీలకమైన వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి 230 స్థానాల్లో గెలిపొందింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది. అయితే షిండే తిరిగి సీఎం పదవి ఆశించారు. కానీ ఆ పదవిని బీజేపీ దక్కించుకుంది. కనీసం హోంశాఖ అయినా దక్కుతుందని ఆశించారు. చివరికి ఆ పదవి కూడా దూరమైపోయింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!