Revanth Reddy: అన్ని మతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- అన్ని మతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్వమతాలకు రక్షణగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంథ్. ఏసు ప్రభువు జన్మించిన నెల. సోనియా గాంధీ పుట్టిన నెల. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల. ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే.. పొరుగువారిని ప్రేమించాలని ఏసు ప్రభువు సందేశం అందించారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్స్ కూడా పేదలకు విద్య, వైద్య సేవలు అందించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కంటే ఎక్కువ నాణ్యమైన సేవలు అందించి సమాజ నిర్మాణంలో వారు భాగస్వామ్యం అవుతున్నందుకు వారికి అభినందనలు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది.’’ అని రేవంత్ రెడ్డి కొనియాడారు.
‘‘ఎవరు కూడా మరో మతానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడే చర్యలను ప్రభుత్వం సహించదు. ఎవరి విశ్వాసం వారు పాటించ వచ్చు… కానీ పరమత దూషణలు ప్రభుత్వం సహించదు. 100 శాతం తెలంగాణలో మీకు రక్షణ ఉంటుంది. పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దళిత, గిరిజన, క్రిస్టియన్ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుంది. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేద దళితులు, దళిత క్రిస్టియన్స్కు లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఆలోచ చేస్తోంది. ప్రభుత్వంలో మీకు సముచిత స్థానం కల్పిస్తుంది. భవిష్యత్లో పార్టీలోనూ సముచిత స్థానం కల్పించాలని పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నా. క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారి వివరాలు వారికి ఇస్తే సముచిత స్థానం కల్పిస్తారు. సంక్షేమ పథకాల్లో మీ కోటా, మీ వాటా మీకు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది. ఇది అన్ని మతాలను సమానంగా చూసే ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీది.’’ అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ క్రైస్తవ సంఘాల విశ్వాసులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!