Kishan Reddy: బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఓటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు, మీడియాకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.. పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్రూమ్స్లో ఈవీఎంలను భద్రపరుస్తాం..
Also Read
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని.. మహిళలు, యువత బీజేపీని ఆదరించారని కిషన్ రెడ్డి తెలిపారు. అర్బన్ ఏరియాలో ఓటింగ్ తక్కువ అయినా.. బీజేపీకి పడ్డాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టినా బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. ప్రత్యర్థులం తప్ప శత్రువులం కాదన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి డబల్ డిజిట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు గోబెల్ ప్రచారం చేసినా.. ప్రజలు బీజేపీని ఆదరించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో యాత్రలు నిర్వహించామని కిషన్ రెడ్డి తెలిపారు. సంకల్ప యాత్రలు, ప్రధాని పర్యటనలు తెలంగాణలో గెలుపుకు ప్లస్ అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు రెస్ట్ తీసుకోకుండా పనిచేశారు.. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు.
Warangal: వరంగల్ జిల్లా నాగారంలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ
రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. వాళ్ల నాయకుడికే దిక్కులేదు.. అక్కడ ఇక్కడ ఉరుకుతున్నారని విమర్శించారు. స్థాయిని తెలుసుకొని సవాళ్లు విసిరితే బాగుంటుందని అన్నారు. మాటలు తాము కూడా మాట్లాడగలమన్నారు. దేవుడిని నమ్మని వాళ్ళు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. తమ ఎజెండాలో లేని విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని అన్నారు. అబద్దాలు రాజ్యం ఏలుతున్నాయని.. ఎలక్షన్ కమిషన్ పంచిన స్లిప్స్ కూడా పనికిరాలేదని తెలిపారు. కావాలని ఒక వర్గం ఓట్లు తొలగించారని ఆరోపించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ ఏజెంట్లు లేరని.. ఆ పార్టీ ఏజెన్సీల ద్వారా ఏజెంట్లను పెట్టిందని అన్నారు. మరోవైపు.. మజ్లిస్ కాంగ్రెస్ కు సహకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!