పంజాబ్లో తెలంగాణ ఆర్మీ జవాన్ మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ సాయికిరణ్ రెడ్డి పంజాబ్లో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారంరోజులుగా సాయికిరణ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విధుల కోసం వెళ్లిన సాయికిరణ్ అసలు పంజాబ్ చేరుకున్నాడో లేదో అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అతడికి ఏం జరిగిందోనని భయాందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాయికిరణ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read Also: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు
Also Read
కాగా 20 రోజుల సెలవులు ఇవ్వడంతో నవంబర్ 16న స్వగ్రామానికి వచ్చిన సాయికిరణ్ రెడ్డి.. సెలవులు ముగిసిన వెంటనే డిసెంబర్ 5న మధ్యాహ్నం తన గ్రామం నుంచి పంజాబ్ బయలుదేరాడు. అదేరోజు రాత్రి 8 గంటలకు తాను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్నానని తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. అదే సాయికిరణ్ మాట్లాడిన చివరి కాల్ అని.. అప్పటి నుంచి ఇప్పటివరకు అతడి ఫోన్ స్విచ్ఛాఫ్లోనే ఉందని కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా సాయికిరణ్ పంజాబ్లోని ఫరీద్ కోట్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!