Seed Companies Fraud: లక్కీడ్రాలు, స్కీంల పేరిట విత్తనకంపెనీల మోసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా కొత్త వెరైటీలంటూ రైతుల ఉసురుపోసుకుంటున్నారు..ఏదో రకం అంటూ అంటగట్టడం నష్టపోవడం రైతన్న వంతౌతోంది..
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని రూరల్ మండలం లోకారి,పిప్పల్ దరితోపాటు ఉట్నూర్ ఏజెన్సీలోని పలు గూడెల్లో విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులను నమ్మించి బుట్టలో వేస్తున్నారు. ఆషామాషీ కాదు బంపర్ ఆఫర్ అంటూ బోల్తా కొట్టిస్తున్నారు.. కేవలం తమ కంపెనీల విత్తన ప్యాకెట్లు మూడు కొంటే చాలు ఎద్దుల జత లేదంటే హెల్మెట్ ఇలా రకరకాల గిప్టు ప్యాక్ లంటూ గ్రామాల్లో ఊదరగొడుతున్నారు..అంతేకాదు కేవలం రెండువందలు కడితే భారీ గిఫ్ట్ మీసొంతం చేసుకోవచ్చంటూ అడ్వాన్స్ బుకింగ్ చేస్తూ కూపన్ల పంపిణీకి తెరలేపారు. రైతులను మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసే ఎత్తులేస్తున్నారు.
Also Read
గతంలో కొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం అలాగే గిప్టుల పేరుతో ఒక్కటి కాదు రెండు కాదు 5 వేలమంది నుంచి ఒక్కోక్కరి వద్ద 200 రూపాయల చొప్పున లక్కీ డ్రా పేరిట వసూల్ చేశారు .గిప్ట్ మాత్రం ఎవ్వరికి రాలేదు..పైగా తామంతా మోసపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..పైగా ఇచ్చిన సీడ్స్ సైతం కాతపూత లేక పెట్టుబడి సైతం లాస్ అయ్యామంటున్నారు.. ఇప్పుడు సైతం నదుల పేరున్న ఓ కంపెనీ,మరో రెండు కంపెనీల ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో తిరుగుతూ మళ్లీ వసూల్లు చేస్తున్నారని రైతులు చెప్పుతున్నారు.
లక్కీ డ్రా ల పేరిట డబ్బులు వసూల్ చేయడం నిబంధనలకు విరుద్దం. పైగా ఎవరూ అడ్వాన్స్ బుకింగ్ చేయించు కోవద్దు..ఎలాంటి వెరైటీ అయినా అందుబాటులోనే ఉంటుంది..కంపెనీలు ఎలాంటి ప్రచారం చేసినా విత్తనాలు కొనుక్కోవాలని వత్తిడి చేసినా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు..ఎవ్వరైనా లక్కీడ్రాల పేరుతో వసూళ్లకు తెగిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు అధికారులు. ఇలా విత్తన కంపెనీల మోసాలకు ఏటా అన్నదాత బలౌతున్నా అధికారులు చేపట్టేచర్యలు నష్టాలను ఏమాత్రం నివారించలేకపోతున్నాయి.
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?