మియాపూర్ పీయస్ పరిధిలో ఆయుధాలతో పట్టుబడిన పాత నేరస్తులు పట్టబడ్డారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. బీహార్కు చెందిన ఒకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక తపంచా, ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు మ్యాగ్జీన్ లు, 13 బుల్లెట్లు, ఒక బైక్, ఒక కారు, ఆరు మొబైల్స్ను పోలీసులు సీజ్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ.. కొంతమంది వెపన్స్ తో మంజీరా పైప్ లైన్ రోడ్డు లో తిరుగుతున్నారనీ నిన్న ఉదయం 10 గంటలకు మియాపూర్ పోలీసులకు సమాచారం వచ్చిందని ఆమె వెల్లడించారు. మియాపూర్ పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు మంజీరా పైప్ లైన్ రోడ్డు లో వెహికిల్స్ చెకింగ్ చేశారని, ఈ చెకింగ్స్ లో స్వాన్ లియోనార్డ్ అలియాస్ కన్నా, చింతకింది సాయిరాం, గోపగాని సాయికృష్ణ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
A1 కన్నా వద్ద ఒక తపంచా, 9 బుల్లెట్లు లభించాయని, కన్నా వెనుక కారులో వస్తున్న చింతకింది సాయిరాం, గోపగాని సాయికృష్ణ ల వద్ద మరో పిస్టల్, బుల్లెట్లు లభించాయని ఆమె పేర్కొన్నారు. A1 కన్నా పై గతంలో ఐదు కేసులు ఉన్నాయని, A2, A3 ల పై కూడా గతంలో యాదాద్రి లో అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు. బీహార్ కు చెందిన పరారీలో ఉన్న A4 లో అలోక్ నుండి వెపన్స్ కొనుగోలు చేశారని ఆమె వివరించారు.