Kavitha : అహంకారమే పార్టీని ముంచింది.. లిక్కర్ కేసు కాదు.. కేసీఆర్, కేటీఆర్లపై కవిత సంచలనం
- లిక్కర్ కేసుపై కేటీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్
- ఎన్నికల ఓటమికి అసలు కారణాలేమిటి?
- అహంకార ధోరణే బీఆర్ఎస్ పతనానికి కారణమా?
- సొంత పార్టీపై కవిత భావోద్వేగ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన వేళ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఓటమికి బాధ్యతను తన మీదకు తోసేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఓటమికి దారితీసిన పరిస్థితులను బహిరంగంగా విశ్లేషించారు.
లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న వాదనలో అసలు లాజిక్ లేదని కవిత కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఒక్క స్పీచ్లో కూడా తన కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. విపక్షాలు తనపై దాడి చేస్తున్నా, పార్టీ నాయకత్వం కనీసం స్పందించి జవాబు ఇచ్చే ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన చాలా కాలానికి, అంటే మార్చి నెలలో తన అరెస్ట్ జరిగిందని, అలాంటప్పుడు అంతకుముందే వచ్చిన ఎన్నికల ఫలితాలకు ఈ కేసు ఎలా కారణమవుతుందని ఆమె సూటిగా నిలదీశారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!
బీఆర్ఎస్ పతనానికి లిక్కర్ స్కామ్ కారణం కాదని, పార్టీ అగ్రనేతల అహంకారమే అసలు కారణమని కవిత కుండబద్దలు కొట్టారు. ప్రజలు వద్దని మొత్తుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజల నెత్తిన రుద్దడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. “నేను ఎవరిని నిలబెట్టినా మీరు ఓటు వేయాలి” అనే నిరంకుశ ధోరణితో వ్యవహరించడం వల్ల ప్రజలు విసిగిపోయారని, ఆ అహంకార ధోరణే పార్టీని ఓడించిందని ఆమె విమర్శించారు. నేతలు ప్రజలకు ఎంతలా దూరమయ్యారంటే.. సామాన్య కార్యకర్తలకు నేతల దర్శనం కంటే దేవుడి దర్శనమే సులభంగా దొరికేంతగా పార్టీ మారిపోయిందని ఎద్దేవా చేశారు.
తనపై కేసు నడుస్తున్న సమయంలోనే మునుగోడు వంటి ఉపఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని కవిత గుర్తు చేస్తూ, అప్పుడు లేని నష్టం ఇప్పుడే ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేవలం పార్టీ లోటుపాట్లను, వ్యూహాత్మక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఓటమి భారమంతా తన మీదకు, ఈ కేసు మీదకు నెట్టడం సరికాదని కేటీఆర్కు హితవు పలికారు. ఇటువంటి అబద్ధాలు , నీలాపనిందల వల్లే మనసు విరిగిపోయిందని ఆమె భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నుంచే తనకు ఎదురవుతున్న ఈ పరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..