MLC Jeevan Reddy: మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి.. ఏదో ఆయన తెచ్చినట్టు గొప్పలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ కి ..మెట్రో అనేది పెట్టుబడి దారుల కోసం పెట్టినట్టు ఉందని ఆరోపించారు. బిల్డర్ lnt 90 శాతం.. 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 31 km భారం రాష్ట్ర ప్రభుత్వమే భారం మొస్తుందని అన్నారు. పెట్టుబడి దారుల కోసమే ఏర్పాటు చేస్తూనట్టు ఉంది మెట్రో అంటూ ఎద్దేవ చేశారు. Mgbs నుండి ఫలక్ నుమా నుండి మెట్రో లైన్ వేస్తే km తగ్గుతుందని అన్నారు. ప్రయాణికులకు కూడా వెసులుబాటు వుంటుందని పేర్కొన్నారు జీవన్ రెడ్డి. మెట్రో ఏదో కేసీఆర్ తెచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని అన్నారు. పెట్టుబడి దారులు.. రియల్ ఎస్టేట్ వాళ్లకు లాభం చేకూర్చే పనిలో ప్రభుత్వం పడిందని మండిపడ్డారు. రెండో ఫేజ్ లో bhel.. పఠాన్ చేరు వరకు మెట్రో పొడగించాలని డిమాండ్ చేశారు. Trs పేరు మార్పు అంటే..trs ని రద్దు చేసుకోవడమే అన్నారు. Trs పెట్టి రాష్ట్రాన్ని దోచారు.. ఇప్పుడు ఇగ దేశం మీద పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన రాయితీలు అన్ని కేసీఆర్ నిలిపేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇస్తా అన్న రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతు పై లక్షకు నాలుగు వడ్ల భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదని, రైతు బంధు ..జిందాతిలిస్మాత్ లెక్క చేశారు కేసీఆర్ అని ఎద్దేవ చేశారు. 24 గంటలు కరెంట్ ఎక్కడ ఇస్తున్నావో చూపెట్టూ అంటూ ప్రశ్నించారు. Brs తో తెలంగాణ కి కేసీఆర్ నుండి విముక్తి కలిగిందని అన్నారు. కవిత విషయంలో cbi ఉదాసినతగా వ్యవహారం చేస్తుందని మండిపడ్డారు. అమిత్ అరోరా స్టేట్మెంట్ కి అనుగుణంగా కవితకి నోటీసులు ఇచ్చారని, 41 a కింద నోటీసు ఇవ్వాలని కోరారు. 160 కింద కాదు నోటీసులు ఇవ్వల్సిందే నని అన్నారు. Bl సంతోష్ కి 41a కింద ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. కవితను సాక్షిగా విచారణ కోసమే తెర మీదకు తెచ్చారని, కవిత సాక్ష్యాలు తారుమారు చేశారని cbi అన్నదని నిప్పులు చెరిగారు. అది కూడా నేరమే కదా? అంటూ ప్రశ్నించారు. సిట్ దూకుడుగా ఉందని, CBI ఉదాసినతగా ఉందని ఆరోపించారు. ఫోన్ లు ధ్వంసం చేశారు అని చెప్పింది కూడా సీబీఐ నే అని అన్నారు. అలాంటప్పుడు 160 crp కింద ఎలా నోటీసులు ఇస్తారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Cyclone Mandous: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న మరబోటు
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..