Cyclone Mandous: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న మరబోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermen Boat Stuck In Ullapalem Sea: మాండూస్ తుఫాన్ కారణంగా.. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం సముద్రతీరంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. దీంతో.. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల మరబోటు చిక్కుకుంది. అందులో ఓడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. తుఫాను తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ సహాయక చర్యల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఆ మత్స్యకారులు ఆరు రోజుల ముందు సముద్రంలో వేటకు వెళ్లినట్టు తెలిసింది. తమ వద్ద ఉన్న ఫోన్ ద్వారా మత్స్యకారులు పోలీసులకు లొకేషన్ షేర్ చేశారు. వర్షం, తీవ్రగాలుల ధాటికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారి వద్దకు చేరలేకపోతున్నారు. దీంతో.. మరో బోటు సహాయంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
Mandous Cyclone Live Updates: మాండూస్ విలయం.. లైవ్ అప్డేట్స్
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
కాగా.. మాండూస్ తుఫాన్కి ఏపీలోని చాలా రాష్ట్రాలు ఎఫెక్ట్ అయ్యాయి. చాలాచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలావరకు జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. ఆయా జలాశయాల నుంచి భారీ స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో.. పరివాహక ప్రాంతాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈ మాండూస్ తుఫాన్ చాలా ఆస్తినష్టం సంభవించింది. పలుచోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో.. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల జనాలు ఇల్లు వదిలి, రోడ్లపైకి వచ్చేశారు. చిత్తూరు జిల్లా అయితే ఈ తుఫాన్ వల్ల అతలాకుతలం అయ్యింది. తిరుమలలో పాపవినాశనం, గోగర్భం డ్యాంను నిండిపోయాయి. అటు.. వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడటంతో, శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసివేశారు. వర్షం తగ్గేంత వరకు భక్తులకు అనుమతి లేదని టీటీడీ అధికారులు తేల్చేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..