Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: జగిత్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ పాదయాత్ర 11వ రోజు కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడి నుండి బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” ప్రారంభమైంది. ఈ పాదయాత్ర సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట మీదుగా వేంపేట వరకు కొనసాగనుండగా.. బండి సంజయ్ వేంపేట సమీపంలో రాత్రి బస చేయనున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈసందర్బంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కాం తో దోచుకుందని ఆరోపించారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. సారా దందాతో పాటు క్యాసినోలో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇక్కడ ఉపాధి లేపకపోవడంతో గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే.. గల్స్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Sajjala Ramakrishna Reddy : దింపుడు కళ్లెం ఆశతో జగన్పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారు
Also Read
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతిపరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ లో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి సంతోషంగా ఉందని అన్నారు. ఫలితాల కోసం ప్రపంచం దృష్టంతా గుజరాత్ మీదే ఉందని తెలిపారు. అన్ని పార్టీలు ఒకటై మోడీ గారి ఇమేజ్ను బ్యాడ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గుజరాత్ ఫలితాలు తెలుపుతున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుజరాత్ గురించి చాలాసార్లు మాట్లాడారు ఏమి అభివృద్ధి అని అన్నాడు స్పందన చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన మెజార్టీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
Data Theft: 6 లక్షల మంది భారతీయుల డేటా దొంగిలించి, అమ్మకం
తాజావార్తలు
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!