Data Theft: 6 లక్షల మంది భారతీయుల డేటా దొంగిలించి, అమ్మకం
Stolen Data Of Indians Sold On Bot Markets: వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హ్యాకర్లు ప్రజల వివరాలను సేకరించి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ డేటా మిస్ యూస్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద వీపీఎన్ సెరిస్ ప్రొవైడర్లలో ఒకటైన నార్డ్ వీపీఎన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది ప్రజల డేటా దొంగిలించి బోట్ మార్కెట్ లో విక్రయించారు. కలరవరపడే విషయం ఏంటంటే.. ఒక్క భారతదేశం నుంచే 6 లక్షల మంది డేటా ఇందులో ఉంది. బోట్ మార్వెల్ ద్వారా ప్రజల డివైసెస్ నుంచి దొంగిలించిన సమాచారాన్ని విక్రయించడానికి బోట్ మార్కెట్లను హ్యకర్లు ఉపయోగిస్తుంటారు.
లిథుమేనియా నోర్డ్ సెక్యురిటీకి రెండిన నోర్డ్ వీపీఎన్ అధ్యయనం ప్రకారం.. దొంగతనానికి గురైనా డేటాలో వినియోగదారులకు సంబంధించిన లాగిన్ లు, కుకీలు, డిజిట్ ఫింగర్ ఫ్రింట్ లు, స్క్రీన్ షాట్స్ ఇతర సమాచారం ఉంది. హ్యాకర్లు ఈ డేటాను సగటున ఒక్కో వ్యక్తి సమాచారాన్ని రూ.490 రూపాయలకు అమ్ముతున్నారు. 2018లో బోట్ మార్కెట్లు ప్రారంభించినప్పటి నుంచి నోర్డ్ వీపీఎన్ డేటాను ట్రాక్ చేసింది.
Also Read
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
Read Also: Rivaba Jadeja: భారీ విజయం దిశగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. లీడింగ్లో “మోర్బీ” హీరో
భారత దేశంలో గత కొంత కాలం నుంచి సైబర్ సెక్యూరిటీ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. తరుచుగా చైనా, హాంకాంగ్ నుంచి హ్యాకర్లు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వెబ్ సైట్లపై పడుతున్నారు. ఇటీవల దేశంలో అత్యంత ప్రముఖ ఆస్పత్రి అయిన ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యక్ చేశారు. ఎయిమ్స్ పై రాన్సన్ వేర్ అటాక్ జరిగింది. నవంబర్ 30 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) 24 గంటల్లో దాదాపుగా 6 వేల హ్యాకింగ్ ప్రయత్నాలు ఎదుర్కొంది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ఈ ఏడాది ప్రారంభంలోనే సైబర్ సెక్యూరిటీ నియమాలను కఠినతరం చేసింది. టెక్ కంపెనీలు ఇటువంటి సంఘటనలను గమనించిన ఆరు గంటల్లోనే నివేదించాలని కోరింది. నార్డ్ వీపీఎన్ అధ్యయనం మూడు ప్రధాన బోట్ మార్కెట్లను పరిశీలించింది. జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీలను పరిశీలించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ ఖాతాల నుంచి దొంగిలించిన లాగిన్లను కనుక్కుంది.
తాజావార్తలు
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో