Data Theft: 6 లక్షల మంది భారతీయుల డేటా దొంగిలించి, అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stolen Data Of Indians Sold On Bot Markets: వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హ్యాకర్లు ప్రజల వివరాలను సేకరించి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ డేటా మిస్ యూస్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద వీపీఎన్ సెరిస్ ప్రొవైడర్లలో ఒకటైన నార్డ్ వీపీఎన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది ప్రజల డేటా దొంగిలించి బోట్ మార్కెట్ లో విక్రయించారు. కలరవరపడే విషయం ఏంటంటే.. ఒక్క భారతదేశం నుంచే 6 లక్షల మంది డేటా ఇందులో ఉంది. బోట్ మార్వెల్ ద్వారా ప్రజల డివైసెస్ నుంచి దొంగిలించిన సమాచారాన్ని విక్రయించడానికి బోట్ మార్కెట్లను హ్యకర్లు ఉపయోగిస్తుంటారు.
లిథుమేనియా నోర్డ్ సెక్యురిటీకి రెండిన నోర్డ్ వీపీఎన్ అధ్యయనం ప్రకారం.. దొంగతనానికి గురైనా డేటాలో వినియోగదారులకు సంబంధించిన లాగిన్ లు, కుకీలు, డిజిట్ ఫింగర్ ఫ్రింట్ లు, స్క్రీన్ షాట్స్ ఇతర సమాచారం ఉంది. హ్యాకర్లు ఈ డేటాను సగటున ఒక్కో వ్యక్తి సమాచారాన్ని రూ.490 రూపాయలకు అమ్ముతున్నారు. 2018లో బోట్ మార్కెట్లు ప్రారంభించినప్పటి నుంచి నోర్డ్ వీపీఎన్ డేటాను ట్రాక్ చేసింది.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Read Also: Rivaba Jadeja: భారీ విజయం దిశగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. లీడింగ్లో “మోర్బీ” హీరో
భారత దేశంలో గత కొంత కాలం నుంచి సైబర్ సెక్యూరిటీ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. తరుచుగా చైనా, హాంకాంగ్ నుంచి హ్యాకర్లు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వెబ్ సైట్లపై పడుతున్నారు. ఇటీవల దేశంలో అత్యంత ప్రముఖ ఆస్పత్రి అయిన ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యక్ చేశారు. ఎయిమ్స్ పై రాన్సన్ వేర్ అటాక్ జరిగింది. నవంబర్ 30 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) 24 గంటల్లో దాదాపుగా 6 వేల హ్యాకింగ్ ప్రయత్నాలు ఎదుర్కొంది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ఈ ఏడాది ప్రారంభంలోనే సైబర్ సెక్యూరిటీ నియమాలను కఠినతరం చేసింది. టెక్ కంపెనీలు ఇటువంటి సంఘటనలను గమనించిన ఆరు గంటల్లోనే నివేదించాలని కోరింది. నార్డ్ వీపీఎన్ అధ్యయనం మూడు ప్రధాన బోట్ మార్కెట్లను పరిశీలించింది. జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీలను పరిశీలించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ ఖాతాల నుంచి దొంగిలించిన లాగిన్లను కనుక్కుంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!