PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ
- ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET పరీక్ష పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఆయన, పేపర్ లీక్లకు పాల్పడిన దోషులకు వేగంగా శిక్షలు విధించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
విద్యార్థుల భవిష్యత్తే అత్యంతం
ప్రధాని మోడీ గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొన్నారు. పీఎం మాట్లాడుతూ.. “మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. పేపర్ లీక్లకు పాల్పడిన దోషులకు వేగంగా, కఠినంగా శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో కీలక అడుగు. యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం.” అని ప్రధాని తెలిపారు.
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
ఫాస్ట్ట్రాక్ కోర్టులతో వేగవంతమైన న్యాయం
పేపర్ లీక్ కేసుల విచారణ సంవత్సరాల తరబడి కొనసాగకుండా, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా వేగంగా విచారణ పూర్తి చేసి దోషులకు కఠిన శిక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు విద్యార్థుల్లో విశ్వాసం కూడా బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
NEET వివాదం నేపథ్యంలో కీలక ప్రకటన
ఇటీవల NEET పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, నేరస్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. NEET పేపర్ లీక్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ ప్రకటన విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక సందేశంగా మారింది. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…
— Narendra Modi (@narendramodi) July 23, 2026
తాజావార్తలు
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి