PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ
- ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET పరీక్ష పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఆయన, పేపర్ లీక్లకు పాల్పడిన దోషులకు వేగంగా శిక్షలు విధించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
విద్యార్థుల భవిష్యత్తే అత్యంతం
ప్రధాని మోడీ గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొన్నారు. పీఎం మాట్లాడుతూ.. “మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. పేపర్ లీక్లకు పాల్పడిన దోషులకు వేగంగా, కఠినంగా శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో కీలక అడుగు. యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం.” అని ప్రధాని తెలిపారు.
Also Read
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఫాస్ట్ట్రాక్ కోర్టులతో వేగవంతమైన న్యాయం
పేపర్ లీక్ కేసుల విచారణ సంవత్సరాల తరబడి కొనసాగకుండా, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా వేగంగా విచారణ పూర్తి చేసి దోషులకు కఠిన శిక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు విద్యార్థుల్లో విశ్వాసం కూడా బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
NEET వివాదం నేపథ్యంలో కీలక ప్రకటన
ఇటీవల NEET పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, నేరస్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. NEET పేపర్ లీక్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ ప్రకటన విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక సందేశంగా మారింది. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…
— Narendra Modi (@narendramodi) July 23, 2026
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!