MLA Raja Singh: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై రాజాసింగ్ రియాక్షన్.. ఆ విషయంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా రావడానికి సిద్ధం!
- ఎమ్మెల్యే రాజాసింగ్ సీనియర్ నాయకుడు, నేను సామాన్య కార్యకర్తను: కిషన్ రెడ్డి..
- తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్..
- వ్యక్తిగత విభేదాలను విడిచి పెట్టి, ఐక్యంగా లక్ష్య సాధన కోసం పని చేద్దాం: రాజాసింగ్..
MLA Raja Singh: తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే రాజా సింగ్ “సీనియర్ నాయకుడు” అని, తనను “సామాన్య కార్యకర్తను” అని పేర్కొనడమే కాకుండా, రాజా సింగ్ చెప్పినట్లు తాము పాటిస్తామని రాష్ట్ర కమలం పార్టీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ శాసన సభ్యులు రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభేదాలను విడిచి పెట్టి, ఐక్యంగా లక్ష్య సాధన కోసం పని చేద్దామని కోరారు. మీరు ఎప్పుడు కలిస్తానని చెప్పిన అప్పుడు వచ్చి కలుస్తానన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుండాలని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేది నా ఉద్దేశ్యం.. వ్యక్తిగత లబ్ధి, పదవుల కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని రాజాసింగ్ వెల్లడించారు.
Read Also: Jasprit Bumrah: ఎట్టకేలకు టెస్టు కెప్టెన్ ఎంపికపై మౌనం వీడిన జస్ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే..?
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
అయితే, పార్టీని బలోపేతం చేయడం కోసం అంకితభావంతో పని చేశాను అని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధించడంపై దృష్టి పెట్టడానికి బదులుగా, పార్టీకి నిస్వార్థ సేవ చేసినప్పటికీ, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, అడ్డంకులు సృష్టించడం జరుగుతోంది అని పేర్కొన్నారు. ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం?.. ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా నిలబడ్డాను.. ఈ రోజు కూడా నా కోసం కాకుండా, పార్టీ ఐక్యత కోసమే పని చేస్తున్నాను, లక్షలాది మంది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను.. కొంచెం సమయం కేటాయించండి.. వ్యక్తిగతంగా కలిసి, తమ సమస్యలను పరిష్కరించుకుందాం అన్నారు. కిషన్ రెడ్డి ఎక్కడికి, ఎప్పుడు అనేది నిర్ణయిస్తే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తాను పార్టీని విభజించడానికి కాదు– ఐక్యంగా ఉండటానికి ఇక్కడ ఉన్నాను అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!